1.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పివి కుమార్తె
మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవిని టిఆర్ఎస్ తమ అభ్యర్ధిగా బరిలోకి దింపింది ఈ మేరకు ఆమెకు బి ఫారం ను కెసిఆర్ అందజేశారు.
2.వరవరరావు కు బెయిల్ మంజూరు
విరసం నేత వరవర రావు కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.షరతులతో కూడిన మెడికల్ బెయిల్ ను మంజూరు చేసింది.
3.హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ నగరంలో ఈనెల 24న మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఓటర్ బోర్డు అధికారులు తెలిపారు.
4.వరంగల్ జిల్లాలో చిరుత పులి సంచారం
వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ వాజేడు మండలం లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.కొంగల జలపాత సమీపంలోని అడవిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
5.మేయర్ గా బాధ్యతలు స్వీకరణ
జిహెచ్ఎంసి కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
6.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇచ్చినా ఒకే
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని పార్టీ అధిష్టానం ఎవరికి అప్పగించినా, తామంతా మద్దతు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
8.సింగూర్ రిజర్వాయర్ కు రెండు లిఫ్టులు
సింగూర్ రిజర్వాయర్ పై రెండు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
9.మున్సిపల్ ఎన్నికలు బిజెపి జనసేన కలిసికట్టుగా
ఏపీలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలలో జనసేన బీజేపీ పోటీ చేస్తానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
10.ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
11.నేడు ఏపీ సెట్ ఫలితాలు
రాష్ట్రంలోని యూనివర్సిటీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టుల భక్తిలో ప్రాధాన్యం కల్పించే రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 ఫలితాలు సోమవారం విడుదల చేస్తున్నట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.
12.దుర్గ గుడి అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక
విజయవాడ దుర్గగుడి లో చోటు చేసుకున్న అవినీతిపై ప్రభుత్వానికి ఎసిబి అధికారులు నివేదిక అందించారు.
13.విద్యుత్ షాక్ తో చిరుత మృతి
కడప జిల్లా ముద్దనూరు మండల పరిధి శెట్టి వారి పల్లె కొండ ప్రాంతంలో విద్యుత్ షాక్ తో చిరుతపులి మరణించింది.
14.మెక్సికో ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదం
మెక్సికో దేశంలో జరిగిన ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంలో ఆరుగురు సైనికులు మృతి చెందారు.
15.2022 లో చంద్రయాన్ 3 ప్రయోగం
2022 లో చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు.
16.బీజేపీ లోకి పిటి ఉష
పరుగుల రాణి గా పేరు పొందిన పిటి ఉష బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
17.భారత్ బయోటెక్ సీఎండి, జేఎండి లకు అవార్డులు
స్వదేశీ కరోనా టీకా కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సిఎండీ , జేఎండీ లను ప్రతిభా పురస్కారాలు వరించాయి.డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డులు అందజేశారు.
18.వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను వెంటనే తీసేయాలి అని టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
19.పూణేలో ఒక్కరోజే 1176 కరోనా కేసులు
పూణేలో ఒక్కరోజులోనే 1176 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా, ఆరుగురు కరోనా ప్రభావం తో మృతి చెందారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,130
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,130
.