1.టిడిపి వైసిపి కార్యకర్తల రాళ్ల దాడి
గుంటూరు జిల్లా వినుకొండ మండలం మొలకలూరు గ్రామం లో టీడీపీ వైసిపి కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
2.జగన్ కు లోకేష్ సవాల్
అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా 3, 4 వ విడత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు.
3.425 వ రోజుకి అమరావతి దీక్షలు
అమరావతి లోని రాజధాని కొనసాగించాలంటూ అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులు , మహిళలు , వివిధ సంఘాల నేతలు చేపట్టిన నిరసన దీక్ష నేటికి 425 వ రోజుకు చేరుకున్నాయి.
4.జోగి రమేష్ పై హక్కుల సంఘానికి ఫిర్యాదు
కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ తెలిపారు.
5.జైల్లో ఉండి సర్పంచ్ గా విజయం
చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట పంచాయతీ సర్పంచ్ గా టిడిపి మద్దతుదారుడు గుర్రం శివ ప్రసాద్ నాయుడు 56 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పోలింగ్ కు రెండు రోజుల ముందే మద్యం తరలిస్తున్న అంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.జైలు నుంచి ఆయన పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
6.వైభవంగా అంతర్వేది రథ ప్రారంభోత్సవం
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో నూతన రథ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది.
7.ఎస్సీ ఎమ్మెల్యేలతో మంత్రి కొప్పుల భేటీ
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లతో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమై ,కీలక అంశాలను చర్చించారు.
8.జపాన్ లో భారీ భూకంపం
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై 7.1 గా తీవ్రత నమోదయింది.
9.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.జమ్ము కాశ్మీర్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
వివాదాస్పద కాశ్మీర్ స్వయంప్రతిపత్తి బిల్లుకి లోక్ సభ ఆమోదం తెలిపింది.
11.మార్చి 8 కి పార్లమెంట్ వాయిదా
జనవరి 29 న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి.ఒక్క రోజు తేడాతో ఉభయసభలు మార్చి 8వ తేదీకి వాయిదా పడ్డాయి.
12.ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు కీలక ప్రకటన
ప్యాసింజర్ రైళ్లను ఫునః ప్రారంభించడం పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
13.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
14.ఐఎఎస్ ఐపిఎస్ లను కేటాయించాలి
తెలంగాణకు ఐఎఎస్ ఐపిఎస్ లను మరికొంతమంది ని కేటాయించాలి అని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.
15.హైదరాబాద్ శాస్త్రవేత్తకు ఉమెన్ ఎక్స్ లెన్స్ అవార్డు
హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సోనూ గాంధీ కి ఉమెన్స్ ఎక్స్ లెన్స్ అవార్డ్ 2021 లభించింది.గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం తో బాధపడుతూ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
16.ఆర్మీ కి అర్జున్ యుద్ద ట్యాంక్ లు
ప్రధాని నరేంద్ర మోదీ అర్జున్ ఎంబిటి యుద్ద ట్యాంకులను భారత ఆర్మీకి అప్పగించారు.
17.అసదుద్దీన్ పై రాజాసింగ్ ఫైర్
ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పించారు.భవిష్యత్తు లో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజా సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
18.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పితృ వియోగం
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ్ గౌడ్ మరణించారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
19.తమిళ రైతులపై మోదీ ప్రశంసలు
తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,250
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,290
.