1.డ్రైవర్ రహిత తొలి మెట్రో రైలు ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ మెట్రో లో డ్రైవర్ రహిత తొలి మెట్రో రైలు ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
2.ఈడీ కస్టడీకి అగ్రిగోల్డ్ స్కాం నిందితులు
అగ్రిగోల్డ్ స్కాంలో నిందితులను నేడు ఈ డి కస్టడీకి తరలించాలని అన్నారు.ఈ మేరకు ఈ డి కోర్టు నిందితులను పది రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
3.సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డి అనే యువకుడితో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఘనంగా జరిగింది.
4.తెలంగాణలో కరోనా
తెలంగాణ కరుణ పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన
నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు.కంకిపాడు నుంచి ర్యాలీగా గుడివాడ మీదుగా మచిలీపట్నం వరకు పవన్ పర్యటన కొనసాగుతోంది.అనంతరం మచిలీపట్నంలో కలెక్టర్ కు పవన్ వినతిపత్రం ఇస్తారు.
6.కోవిడ్ టీకా డ్రై రన్ విజయవంతం
కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఈరోజు ఉదయం కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రై రన్ విజయవంతంగా ముగిసినట్టు కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ తెలిపారు.
7.రైతుల కోసం అన్నా హజారే నిరాహార దీక్ష
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు మద్దతుగా, తాను నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా 20, 021 ఉత్తరాన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.నేటి నుంచి నాలుగు రాష్ట్రాల్లో టీకా డ్రై రన్
కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు తొలి విడత 30 కోట్ల మందికి కరోనా పేక పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.టీ వ్యాక్సిన్ ఏర్పాట్ల ను పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘ డ్రై రన్ ‘ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ , గుజరాత్ ,అస్సాం రాష్ట్రాలలో నేడు ప్రారంభం అయింది.
10.ఇంటికి చేరుకున్న రజినీకాంత్
ఇటీవల అనారోగ్యానికి గురైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు.
11.9 నెలల తర్వాత తెరుచుకున్న లింగరాజ్ ఆలయం
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింగరాజ్ ఆలయం 9 నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది.కరొనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఈ ఆలయాన్ని మూసే ఉంచారు.
12.ముగిసిన అంతర్వేది రథ ట్రయల్ రన్
ఏడు అంతస్తులతో నూతనంగా నిర్మించిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథ
నిర్మాణం పూర్తయింది.మూడు ఈ సమయంలోనే ఈ రథం నిర్మాణాన్ని పూర్తి చేశారు.దీనికి నేడు ట్రయిల్ రన్ నిర్వహించారు.
13.మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ని నియమించారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
14.జనవరి 8న కే జి ఎఫ్ 2 ట్రీజర్
కే జి ఎస్ 2 ప్రెజర్ ను జనవరి 8 వ తేదీన ఆ చిత్ర హీరో యాష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
15. కరోనా స్ట్రెయిన్ టెన్షన్ .అత్యవసర సమావేశం
తెలంగాణలో ట్రైన్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సీసీ ఎంబి నివేదికపై చర్చించేందుకు తెలంగాణ వైద్య అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ సమావేశానికి సీసీ ఎంబీ శాస్త్రవేత్తలు నేడు అత్యవసరంగా సమావేశం అవుతున్నారు.
16.మరో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ కు మెగాస్టార్ అవకాశం
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోహబూబ్ కు మెగాస్టార్ చిరంజీవి తాను నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఓ పాత్రలో అవకాశం కల్పించారు.
17.కొత్త వైరస్ కు కొత్త పేరు
వివిధ దేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ కు N 440K గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు
18.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,210
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,210
19.విమానాశ్రయానికి ట్రంప్ పేరు
మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికా లోని ఏదో ఒక విమానాశ్రయానికి తన పేరు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
20.జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ల కలకలం
ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ ‘ అనే ఫ్లెక్సీలు ఏపీలో కలకలం రేపాయి.ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో ఇవి చర్చనీయాంశం అయ్యాయి.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు జిల్లాలోని టిడిపిలో హాట్ టాపిక్ గా మారాయి.