1.తాడిపత్రి ఎమ్మెల్యే పై కేసు నమోదు
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
2.కొత్త స్ట్రెయిన్ వైరస్ తో యువతకు ముప్పు
కొత్త స్ట్రెయిన్ వైరస్ తో యువతకు ముప్పు కొంచెం ఉందని డబ్ల్యు.హెచ్.ఓ ప్రకటించింది.
3.ఏపీలో కరోనా వ్యాక్సి న్
నేటి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఏపీలో కరోనా వ్యాక్సిన్ ట్రైల్ రన్ ఉంటుంది అని ఏమి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.ఈనెల 29న కృష్ణాజిల్లాలో యాక్షన్ ట్రైలర్ నిర్వహించబోతున్నారు.
4.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ఉద్రిక్తంగా నే తాడిపత్రి
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతోంది.
6.కరోనా టీకా కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
కోడ్ 19 టీకా తీసుకునేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.
7.తెలంగాణను వీడని కొత్త కరోనా భయం
తెలంగాణలో కొత్త కరోనా వైరస్ భయం రోజురోజుకు పెరిగిపోతోంది.యూకే నుంచి వచ్చిన వారి కారణంగా రోజురోజుకూ పెరుగుతున్నాయి.యూకే నుంచి వచ్చిన 184 మంది ఆచూకీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
8.పోస్టల్ మైక్రో ఏటీఎం లోనూ రైతు బంధు
రైతుల ఖాతాల్లో పడిన రైతు బంధు పథకం డబ్బులను పోస్టల్ శాఖ మైక్రో ఏటీఎం లలోనూ డ్రా చేసుకోవచ్చునని తెలంగాణ పోస్టల్ శాఖ తెలిపింది.
9.వీహెచ్ ను బెదిరిస్తే తిరగబడతాం
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శ్రీ హనుమంతరావు కొంతమంది బెదిరించడాన్ని తెలంగాణలోని 14 బీసీ సంఘాలు ఖండించాయి.ఆయనను బెదిరిస్తే తిరగబడతాం అంటూ హెచ్చరించాయి.
10.బీజేపీ నేత వివేక్ పార్టీ మార్పు పై క్లారిటీ
తెలంగాణ బీజేపీ నేత వివేక్ పార్టీ మారుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని బిజెపి ఖండించింది.
11.ఫిబ్రవరిలో మహాపాదయాత్ర : రెడ్డి జే ఏ సీ
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి విద్య ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి లో మహాపాదయాత్ర నిర్వహించబోతున్నట్టు రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు సవల్గ సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.
12. 31 న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్
సీబీఎస్సీ 10 , 12 తరగతుల పరీక్షల తేదీ ని ఈనెల 31న ప్రకటించబోతున్నారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
13.29 లో గా కాలేజీ లో చేరాలి
ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐ సెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసింది.నెల 24 వరకు ఆప్షన్లు ఇచ్చిన వారి జాబితాను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిందిగా కోరింది.
14.ప్రగతి భవన్ కు కేసీఆర్
గత 13 రోజులుగా ఫామ్హౌస్కు పరిమితం అయిపోయింది తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు.
15.వీహెచ్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంవత్సరం అధిష్టానం సీరియస్ అవడమే కాకుండా, ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
16.నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం
అస్వస్థతకు గురైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కాస్త కుదుట పడినట్లు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
17.నల్గొండ జిల్లాలో స్ట్రెయిన్ కలకలం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది.నల్గొండ లో 9మందికి, సూర్యాపేటలో ఐదు మందికి, యాదాద్రి జిల్లాలో ఒకరికి వచ్చినట్లు వైద్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
18.సైబర్ మోసాలపై లఘు చిత్రం
ఆన్లైన్ వేదికగా పెద్ద ఎత్తున సైబర్ మోసాలు జరుగుతుండడంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.దీనిపై జనాలు అవగాహన పెంచేందుకు 90 సెకన్ల వీడియో ను యూట్యూబ్ లో విడుదల చేసింది.
19.త్వరలో ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో త్వరలోనే పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ లను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,710
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,950
.