1.అన్ లాకింగ్ ఎడ్యుకేషన్
మెరుగైన విద్యా వ్యవస్థ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రచురించిన ‘ అన్ లాకింగ్ ఎడ్యుకేషన్ ‘ అనే పుస్తకాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ ఆవిష్కరించారు.
2.తెలంగాణలో కరోనా
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి.
3.ప్రైవేట్ టీచర్స్ కోసం మహాధర్నా
కోవిడ్ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలపై ఈ నెల 20న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో వేలాది మంది ప్రైవేట్ టీచర్స్ తో మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
4.ముసాయిదా బడ్జెట్ కు ఆమోదం
2001- 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెలలో 5600 కోట్ల తో ముసాయిదా బడ్జెట్ ను ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా యధాతధంగా ఆమోదించింది.
5.చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్దే ను ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది అభ్యర్ధించారు.
6.బాలీవుడ్ లోకి బ్రోచేవారెవరురా
తెలుగులో సూపర్ హిట్ అయిన బ్రోచేవారెవరురా సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతోంది.
7.ఐక్యరాజ్యసమితి అవార్డుకు భారతీయుడు
ఐక్యరాజ్యసమితి ప్రకటించే ‘ యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ – 2020 ‘ విజేత ల్లో భారత్ కు చెందిన విద్యుత్ మోహన్ (29) కూడా ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ అవార్డుకు ఏడుగురు ఎంపికయ్యారు.
8. ఏపీ సీఎస్ ను సత్కరించిన జగన్
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈనెల ఆఖరికి పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో, ఆమెను ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు.
9.రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు
టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రికార్డులను సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
10. కొత్త రకం కరోనా
కరోనా వైరస్ లో జన్యు మార్పులు జరుగుతున్న కారణంగా లండన్ లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.‘ ఎన్ 501 వై ‘ అనే ఈ కొత్త రకం వైరస్ ప్రమాదకరమా కాదా అనే విషయంపై ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు.
11.ఆధార్ కులం వివరాలు అడగొద్దు
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ కులం వివరాలను అడగడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది.
12.విడుదల కానున్న శశికళ
జయలలిత మరణాంతరం జైలుపాలైన ఆమె స్నేహితురాలు శశికళ జనవరి 27వ తేదీన విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది.
13.నిరాడంబరంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
జనవరి 20న అమెరికా 46 అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కోవిడ్ 19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
14.భారత్-బంగ్లా మధ్య ఒప్పందాలు
భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం ఆన్లైన్ సదస్సులో ఒప్పందాలు కుదిరాయి.
15.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,050
16.కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ల పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
17. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్డ్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ ని తీసుకు వచ్చింది.ఇందులో మొబైల్ ఫోన్లకు భారి డిస్కౌంట్ ను ప్రకటించింది.
18.వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర బృందం
నివర్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది.
19.గ్రాండ్ పార్టీ ఇచ్చిన దిల్ రాజు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు 50 పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదులో బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సినీ అగ్ర హీరోలు హీరోయిన్లు సందడి చేశారు.
20.ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలను, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.