1.హడలెత్తిస్తున్న పులి
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం లో పులి దాడులు బెంబేలెత్తిస్తున్నాయి.పెన్ గంగా తీరం , గొల్లఘాట్ దగ్గర ఆవుపై పులి దాడికి పాల్పడింది.
2.22 నుంచి ఎస్ ఎస్ సీ స్టెనో గ్రాఫర్ పరీక్షలు
గ్రేడ్ సీ, గ్రేడ్ డి, స్టెనో గ్రాఫర్ నియామక పరీక్షలు ఈనెల 22 నుంచి 24 ఆన్లైన్ లో నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హైదరాబాద్ విభాగం అధికారి నాగరాజు తెలిపారు.
3.హైదరాబాద్ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు.రెండు రోజులపాటు హైదరాబాదు లోనే ఉండబోతున్నారు.
4.ఓటుకు నోటు కేసు
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ని ముద్దాయి గా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్దే నేతృత్వంలో ని ధర్మాసనం గురువారం విచారించింది.వేసవి సెలవులు తర్వాత దీనిని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
5.మా కోవిడ్ వాక్సిన్ సురక్షితం : భారత్ బయోటెక్
Covid 19 కట్టడికి దేశం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలిదశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.
6.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.రజినీకాంత్ భార్యకు హైకోర్టు నోటీసులు
అశ్రమ్ పాఠశాల వ్యవహారం పై నటుడు రజినీకాంత్ సతీమణి లత రజినీకాంత్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
8.టీ కొట్టు వ్యాపారి కి రూ.109 కోట్ల జిఎస్టి
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో జిఎస్టి బకాయి కింద 109 కోట్లు చెల్లించాలని రోడ్డు పక్కన చిన్న టీ దుకాణం నడుపుతున్న కార్తీక్ కమిల అనే వ్యక్తికి నోటీసులు అందాయి.
9.అడివి శేష్ ‘ మేజర్ ‘ ఫస్ట్ లుక్
ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘ మేజర్ ‘ ఇందులో హీరోగా అడివి శేష్ నటిస్తున్నారు.ఈరోజు ఉదయం 10 గంటలకు ‘ మేజర్ ‘ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
10.F3 సినిమా పూజా కార్యక్రమం
విజయవంతమైన ఎఫ్2 సినిమా 3 సినిమా ఈనెల 23 నుంచి షూటింగ్ జరుపుకోనుంది.దీనికి సంబంధించి ఈరోజు కార్యక్రమం మొదలైంది.
11.ప్రభాస్ ‘ ఆదిపురుష్ ‘ పై కోర్టులో పిటిషన్
ప్రభాస్ ‘ ఆది పురుష్ ‘ చిత్రంపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు.
12.సీఐడీ డీఎస్పీ ఆత్మహత్య
కర్నాటక రాజధాని బెంగళూరులో సీఐడీ మహిళా డిఎస్పీ లక్షి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
13.వాట్సాప్ లో కొత్త ఫీచర్
వాట్సాప్ వెబ్ వెర్షన్ లో త్వరలోనే వీడియో, వాయిస్ కాల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
14.ఎంజీఆర్ రాజకీయ వారసుడి ని నేనే : కమల్
దివంగత ఎంజీఆర్ కలను సహకారం చేస్తే ఆయనకు కానీ రాజకీయ వారసుడి ని అని ‘ మక్కల్ ‘ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్ కమల్ హాసన్ పేర్కొన్నారు.
15.ధరణి పోర్టల్
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్సైట్ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
16.రైతులకు మద్దతుగా ఆత్మ హత్య
నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హర్యానా లోని కర్ణాల్ కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్ ( 65) బుదవారం ఆత్మహత్య చేసుకున్నారు.
17.సంక్రాంతి 1500 ఆర్టీసీ బస్సు లు
రాబోయే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 1500 ప్రత్యేక బస్సులు తిప్పెందుకు ప్రణాళికలు రూపొందించుకుంది.
18.మాజీ మంత్రి అఖిలప్రియ పై కేసు
మాజీమంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ పై కేసు నమోదు అయ్యింది.పట్టణంలో covid నిబంధనల మేరకు సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ ,బుధవారం జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టారని, అందుకే ఆమెపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
19.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,600
20.బాలుడు అదృశ్యం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ని సాయి నగర్ కాలనీకి చెందిన కళ్యాణ్ (17) అనే బాలుడు అదృశ్యమయ్యాడు.బాలుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.