1.ఢిల్లీ కి బండి సంజయ్
బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బండి సంజయ్, నరేంద్ర మోడీ తో భేటీ కాబోతున్నారు.
2.తెలంగాణ లో కరోనా
తెలంగాణ వార్తలు 573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.గచ్చిబౌలి లో చిరుత కలకలం
తెలంగాణలోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో చిరుత సంచరించడం కలకలం రేపుతోంది.ఈ ప్రాంతం లో ఓ కుక్కను ఎత్తుకు వెళ్ళినట్టుగా స్థానికులు పేర్కొన్నారు.
4.రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ ) ను తారుమారు చేసిన కేసులో రిపబ్లిక్ టీవీ సీఈఓ వికాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.ఈ విషయాన్ని ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ ధృవీకరించారు.
5.స్వాతంత్ర సమరయోధుడు మృతి
ముషీరాబాద్ బోయ బస్తీకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు భీమర్తి బాలకృష్ణ మృతి చెందారు.
6.భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లోని ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో 63 లక్షలు విలువచేసే డ్రగ్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు.
7.రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ ముక్కలు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి రేషన్ షాపులో ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ ముక్కలు రావడం కలకలం రేపింది.
8.ఫిబ్రవరి 5 నుంచి ‘గేట్ ‘
Gate 2021 పరీక్ష తేదీలను ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6 ,7 ,12, 13 ,14 తేదీలలో గేట్ ను నిర్వహించబోతున్నారు.
9.15వ తేదీ నుంచి పరీక్షలు
ఎన్జీ పీసీ , ఇసొలేటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్ సింగ్ వెల్లడించారు.
10.స్కూల్స్ ఓపెనింగ్ పై హరీష్ స్పందన
కరోనా కారణంగా మూసివేసిన ప్రైవేటు పాఠశాలలు తిరిగి త్వరలోనే ప్రారంభం అవుతాయని మంత్రి హరీష్ రావు ప్రకటించారు
11.రాష్ట్ర విధుల్లోకి ఐఏఎస్ శ్రీ లక్ష్మి
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులు మేరకు సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
12.ఫార్మా విద్యార్థినికి సోనూసూద్ సహాయం
ఇబ్రహీంపట్నం లోని గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫార్మా సెకండ్ ఇయర్ చదువుతున్న దేవికా రెడ్డి కి సినీ నటుడు సోను సూద్ ఆర్థిక సహాయం అందించారు.
13.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30, 254 కరోనా కేసులు నమోదయ్యాయి.
14.డిజిటల్ ఓటర్ కార్డులు
దేశవ్యాప్తంగా డిజిటల్ ఓటర్ కార్డులను జారీ చేసే విషయమై ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
16.ముగిసిన కెసిఆర్ ఢిల్లీ టూర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగియడంతో హైదరాబాద్ చేరుకున్నారు.
17.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46010
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,190
18.ఏలూరు వింత వ్యాధి ఇప్పుడు గుంటూరులో
ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపిన వింత వ్యాధి ప్రభావం ఇప్పుడు గుంటూరు లోనూ కనిపిస్తుంది.దాచేపల్లి మండలం నడికుడిలో అనేకమంది సృహ తప్పి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది.
19.అమెరికా లో కరోనా విజృంభణ
అమెరికాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా ఈ ప్రభావంతో మృతి చెందారు.
20.మావోయిస్టులు మృతి
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి .ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు.