1.భారత్ బయోటెక్ కు 80 దేశాల ప్రతినిధులు
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ను 80 దేశాల ప్రతినిధులు ఈరోజు సందర్శించారు.
2.టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
పటాన్ చెరువు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది.
భూ కబ్జాలపై వార్త రాసినందుకు ఓ రిపోర్టర్ ను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే బెదిరిస్తూ.కాళ్లు చేతులు నరుకుతా ,చంపేస్తా అంటూ మాట్లాడడం వంటివి వ్యవహారాలపై ఆయనపై కేసు నమోదు అయింది.
3.ప్రధాని మోదీ కి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.వర్చువల్ ద్వారా కొత్త పార్లమెంటు శంకుస్థాపనకు హాజరవుతానని లేఖలో కేసీఆర్ వెల్లడించారు.
4.ఏజెన్సీ లో కొనసాగుతున్న బంద్
ఆదిలాబాద్ ఏజెన్సీలు బంద్ కొనసాగుతోంది.తుడుం దెబ్బ పిలుపుమేరకు స్వచ్ఛందంగా అక్కడి వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు.ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం బంద్ కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది.
5.నకిలీ డాక్టర్ అరెస్ట్
హైదరాబాద్ మీర్పేట పీఎస్ పరిధిలో నకిలీ వైద్యులు పోలీసులు అరెస్ట్ చేశారు ఎటువంటి వైద్య అర్హత లేకుండా వైద్యం చేస్తున్న డాక్టర్ సాయి కుమార్ పోలీసులు అరెస్టు చేశారు.ఇతడు సాయి క్లినక్ పేరుతో హాస్పిటల్ ననడుపుతున్నాడు
6.రేపటి నుంచి తెలంగాణలో ఎడ్ సెట్ కౌన్సెలింగ్
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన కౌన్సిలింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం అవుతుంది.
7.కాంగ్రెస్ నేతలతో మాణిక్యం ఠాగూర్ సమావేశం
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పార్టీలోని కీలక నాయకులతో ఈరోజు సమావేశం అవుతున్నారు.
8.కేటీఆర్ కు నిరసన సెగ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఎల్లారెడ్డిపేట లో మున్నూరు కాపు సంఘం ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న కే టిఆర్ ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
9.ఏలూరు సంఘటనపై జగన్ వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు అంతుచిక్కని వ్యాధి కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా లోని కీలక అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులపై ఆరా తీశారు.
10.చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీ పై ఐటీ దాడులు
చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఈ రోజు ఉదయం ఐటీ దాడులు జరుగుతున్న ఈ చెన్నై, ఆంధ్ర, తెలంగాణ తో కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో 100 టీమ్ ల ఐటీ అధికారులు దాడులు ఏక కాలం లో నిర్వహించారు.
11.ఫోర్బ్స్ జాబితాలో ఆర్థిక మంత్రి
ఫోర్బ్స్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎంపిక చేసింది.ఈ లిస్టులో 41వ స్థానంలో ఆమె నిలిచారు.
12.గృహనిర్బంధం లోనే కేజ్రీవాల్
ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతు తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇంకా గృహనిర్బంధంలో నే కేంద్రం ఉంచింది.
13.యువ నటి మృతి
తమిళ టెలివిజన్ రంగం పాపులారిటీ సాధించిన చిత్ర (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
14.టీకా ముందు మాకే : ట్రంప్
కరోనా వ్యాక్సిన్ ఈ విషయంలో ముందుగా అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
15.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 721 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.మళ్లీ5ప్రారంభమైన వరద సహాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం జిహెచ్ఎంసి నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని జిహెచ్ఎంసి స్పష్టం చేసింది.వరద సహాయం పంపిణీ మంగళవారం నుండి ప్రారంభం అయిందని ప్రకటించింది.
17.లే అవుట్ల క్రమబద్దీకరణ పై హైకోర్టులో విచారణ
క్రమబద్దీకరణ తెలంగాణ హై కోర్టు విచారించింది.ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం గడువు కోరగా, ఐదు వారాలకు వాయిదా వేసింది.
18.రైతులతో చర్చ లను ప్రారంభించిన కేంద్రం
నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులతో కేంద్రం మరోసారి చర్చలు ప్రారంభించింది.
19.పోలవరం లో హీరోయిన్ అనుష్క
ప్రముఖ హీరోయిన్ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వచ్చారు.ఈ సందర్భంగా ఆమె మహానందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
20.తృప్తి దేశాయ్ పై ఈ నెల 11 వరకూ నిషేధాజ్ఞలు
సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ పై అధికారులు ఆంక్షలు విధించారు.డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్ కు షిరిడి ఆలయ ప్రవేశం నిషేధిస్తూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు.
21.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,300 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,500.