1.జబర్దస్త్ కమెడియన్ పై పోలీస్ కేసు
జబర్దస్త్ కమెడియన్ కెవ్వుకార్తిక్ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్, దాడి కేసు నమోదయింది.
2.వరద సహాయం కోసం ఆందోళన
వరద సహాయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు సమీపంలోని మీసేవ కేంద్రం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు.
3.ఖమ్మం జిల్లా లో మినీ ట్యాంక్ బండ్ ప్రారంభం
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం లో మినీ ట్యాంక్ బండ్ ను ప్రారంభించారు.
4.పీజీ ఈసెట్ లో 7774 మంది అర్హత
తెలంగాణలో ఏం ఈ ఎంటెక్ ఎంఫార్మసీ ఎం ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్ మొదటి దశ కౌన్సిలింగ్ అర్హుల జాబితాను ప్రకటించారు.ఇందులో 7774 మంది అర్హత సాధించారని పీజీ ఈ సెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు.
5.ఏపీ తెలంగాణలో 1080 బ్యాంక్ జాబ్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) ఇటీవల ఏకంగా 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 1080 పోస్ట్ లు ఉన్నాయి.వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది.
6.కరోనా తో టీవీ నటి మృతి
కరోనా వైరస్ ప్రభావం తో బాలీవుడ్ నటి దివ్య భట్నాగర్ (34) ఈ రోజు మృతి చెందారు.
7.ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్
ఇటీవల అంతుచిక్కని కారణంతో అస్వస్థతకు గురైన ఏలూరులోని బాధితులను ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
8.బోగస్ పెళ్లిళ్లపై ఆరా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఆదిలాబాద్ జిల్లాలో అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో దీనిపై సమగ్ర దర్యాప్తు కు జిల్లా కలెక్టర్ నేను దిగారు.
9.ఢిల్లీలో ఉగ్ర కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఐదుగురు నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
10.కామారెడ్డి డిఎస్పీ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
11 బిజెపికి ఆరు ఎమ్మెల్సీలు
ఉత్తర ప్రదేశ్ శాసనమండలి లోని 11 సీట్లకు జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల్లో బిజెపికి ఆరు సీట్లు దక్కాయి.సమాజ్ వాదీ 3, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలుపొందారు.
12.రైతుల ఆందోళన కు శివసేన మద్దతు
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులకు చేపట్టిన ఆందోళనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించారు.
13.బీజేపీలో చేరిన విజయశాంతి
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి బిజెపిలో చేరారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో ఆమె చేరారు.
14.అన్నదాతలను ఆదుకోండి అంటూ పవన్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ లో లివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు.
15.ఏలూరు లో పెరుగుతున్న అస్వస్థత కేసులు
పశ్చిమగోదావరి జిల్లాలో అంతు చిక్కని వ్యాధి కారణంగా అస్వస్థత కు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఇప్పటి వరకు 345 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు.
16.తెలంగాణలో కరోనా
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు కొత్తగా 517 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
17.మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా
మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
18.ఏలూరుకు కేంద్ర బృందం
అంతుచిక్కని వ్యాధి కారణంగా రోజురోజుకు బాధితుల సంఖ్య పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం కేంద్ర బృందం రాబోతోంది.ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు.
19.ప్రగతి భవన్ వద్ద గురుకుల పీ ఈ టీ ల ఆందోళన
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వరంగల్ , నాగర్ కర్నూల్ , మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి వచ్చిన మహిళా పీ ఈ టీ లు నిరసనకు దిగారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,920
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,090.