1.బిజెపిలోకి జానారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆయన బిజెపి లో చేరబోతున్నట్టు సమాచారం.
2.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో కొత్తగా 596 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
3.గురుకులాల 5వ తరగతి ఫలితాల విడుదల
తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.ఈ మేరకు గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఫలితాలను ప్రకటించారు.
4.మాజీ మంత్రి మృతి
తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కమతం రాంరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.
5.జీహెచ్ఎంసీ యోగి ట్వీట్
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటడం పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను యోగి అభినందిస్తూ ట్వీట్ చేశారు.
6.మాదాపూర్ లో కిడ్నాప్ కలకలం
మాదాపూర్ లో ధీరజ్ రెడ్డి అనే వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.ఈ వ్యవహారంపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
7.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా
హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యారు.
కరోనా వాక్సిన్ ట్రయిల్స్ లో భాగంగా గత నెల 20 న డోస్ ఇచ్చారు.అయినా ఆయనకు కరోనా సోకింది.ఈ విషయాన్ని మంత్రి ప్రకటించారు.
8.గవర్నర్ కు ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై అసెంబ్లీ తీర్మానం చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
9. పాఠశాలల బంద్
కరుణ వైరస్ ప్రభావం తో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రానున్న విద్యా సంవత్సరం వరకు పాఠశాలలు అన్నిటిని మూసి వేయాలని నిర్ణయం తీసుకుంది.
10.ఎంపీ సుజనా చౌదరి కి పిత్రు వియోగం
బిజెపి ఎంపీ సుజనా చౌదరి తండ్రి జనార్దన్ రావు ఈ రోజు కన్నుమూశారు.ఈవిషయం ట్విట్టర్ ద్వారా సుజనాచౌదరి వెల్లడించారు.
11.టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా
బెల్లంపల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కరోనా ప్రభావానికి గురయ్యారు.ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
12.నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ
ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటం పై కేంద్రం కదిలి వచ్చింది.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభం అయ్యాయి.
13.రేపు ఢిల్లీకి బండి సంజయ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లబోతున్నట్లు సమాచారం.ఈ పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉంది.
14.నో హెల్మెట్ .నో పెట్రోల్
కోల్ కత్తా లో నో హెల్మెట్ నో పెట్రోల్ ఈ విధానాన్ని అమలు చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజు శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
15.కొత్త పార్లమెంటు భవనానికి భూమి పూజ
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం ఈ నెల 10వ తేదీన భూమి పూజ చేయబోతున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
16.సింగరేణిలో ఉద్యోగాలు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన లా విభాగంలో రెండు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు, రెండు సీనియర్ ఆఫీసర్ పోస్టులకు అనుభవం ఉన్న వారిని నియమించడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
17.అస్సాం లో భూప్రకంపనలు
అసోంలోని తేజ్ పూర్ లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
18.ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని టేకులపల్లి మండలం లో ఇల్లందు కు చెందిన ఎమ్మెల్యే హరిప్రియ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేయడం సంచలనం రేపింది.
19.అలా వైకుంఠపురం లో మరో రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమా రికార్డును సొంతం చేసుకుంది.ఐ.ఎమ్.డీ.బి సంస్థ ప్రకటించిన అత్యధికంగా చూసిన సినిమా ట్రైలర్లలో అలా వైకుంఠపురం 20వ స్థానంలో నిలిచింది.దేశంలోని అన్ని భాషల సినిమాలతో పోటీపడి ఈ రికార్డును సొంతం చేసుకుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,070
.