1.జనవరి 4 నుంచి సైనిక నియామక ర్యాలీ
సికింద్రాబాద్ లో జనవరి 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది.
2.పాఠశాలలపై 7న నిర్ణయం
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలా లేక మరికొంత కాలం ఆన్లైన్ ద్వారా కొనసాగించాలా అనే అంశంపై ఈనెల 7న కెసిఆర్ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
3.కరెంటు పొదుపు ఫ్యాన్ ల పంపిణీ
ఇంధన పొదుపులో భాగంగా లక్ష సీలింగ్ ఫ్యాన్ లు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరనీయ వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
4.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణ వ్యాప్తంగా 609 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
5.తేనె వివాదం
దేశం వివాదం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.13 ప్రముఖ బ్రాండ్లకు చెందిన కల్తీ అయిదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ ఈ ) ఇటీవల చేపట్టిన పరీక్షల్లో వెల్లడైంది.డాబర్, పతాంజలి, బైద్య నాథ్ , జండు తదితర కంపెనీలకు చెందిన తేనె లో కల్తీ అయినట్టు నిర్ధారణ కావడంతో, డాబార్ కంపెనీ తమ తేనె లో కల్తీ జరగలేదని ప్రకటించింది.
6.ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ వాసి
నల్గొండ పట్టణానికి చెందిన కోణం సాందీప్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.ఈనెల 1న ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అండర్ 30 పదవ వార్షిక జాబితాలోని 30 మందిలో మొదటి వరుసలో సాంధీప్ నిలిచారు.
7.ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా టీకా
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీలోని ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్ అందించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.
8.టిడిపి సభ్యుల సస్పెండ్
సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కోణంలో వరుసగా ఐదో రోజు టిడిపి సభ్యులు సస్పెండ్ అయ్యారు.ఈ రోజు పదిమంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
9.పవన్ రైతు టూర్ అప్డేట్స్
నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్న పవన్ ఈరోజు, రేపు నెల్లూరు , చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
10.కరోనా టీకాపై ఐక్యరాజ్యసమితి సంచలనం
కరోనా టీకా అందుబాటులోకి వచ్చినా, దానిని అరికట్టడం కష్టమని , అలా భావించటం పిచ్చితనమే అవుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేర్రస్ పేర్కొన్నారు.
11.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,100.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,290.
12.ఏ వ్యాక్సిన్ అయినా ఐదు రోజుల్లో డెలివరీ
కొరియర్ సర్వీసులు దిగ్గజం డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలో ఏ దేశానికి అయినా ఒకటి నుంచి ఐదు రోజుల్లో వ్యాక్సిన్లను అందించగలము అంటూ ప్రకటన విడుదల చేసింది.
13.బిగ్ బాస్ షో పై నోయల్ సంచలన కామెంట్స్
బిగ్ బాస్ ఫోర్ తెలుగులో కంటెస్టెంట్స్ లో నోయాల్ కూడా ఉన్నాడు.ఆరు వారాల తర్వాత అనారోగ్యంతో ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్లాడు.
తాజాగా షో పై పై ఆయన స్పందించారు.అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదని , దీనికి వెళ్లి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదు అనే విషయం అర్థమైంది అంటూ నోయల్ వ్యాఖ్యానించారు.
14.వైసీపీకి పవన్ వార్నింగ్
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ పర్యటన ను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తుండటంతో, వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది వైసీపీ నాయకుల జాగీరు కాదని హెచ్చరించారు.
15.Netflix ఫ్రీ ఆఫర్
భారత్ లో రెండు రోజుల పాటు ఫ్రి యాక్సెస్ కల్పించబోతున్నట్టు Netflix పేర్కొంది.
16.కొడాలి నాని ఇంట్లో బాంబు స్క్యాడ్ తనిఖీలు
కొద్ది రోజుల క్రితం మంత్రి పేర్ని నాని హత్య జరిగిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో గుడివాడలో ఆయన నివాసం వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.
17.వ్యాక్సిన్ పై హ్యాకర్ల కన్ను .ఐబీయం వార్నింగ్
కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్ల ముప్పు పొంచి ఉందని ఐటి దిగ్గజం ఐబీయమ్ హెచ్చరించింది.
18.విజయ్ సేతుపతి తో అనసూయ
తెలుగు పాపులర్ యాంకర్ అనసూయ తమిళ్ యాక్టర్ ” మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి తో దిగిన ఫోటోలను instagram లో అనసూయ పోస్ట్ చేసింది.
19.కంగనా రనౌత్ కు నోటీసులు
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా ట్విట్టర్ లో ప్రముఖ టైం మ్యాగజైన్ గుర్తింపు పొందిన దాదీ బిల్కస్ భాను ను ఉద్దేశించి అభ్యంతరకర ట్వీట్ చేశారు.దీంతో ఆగ్రహించిన ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాకు నోటీసులు జారీ చేసింది.
20.కరోనా టీకా పై ప్రధాని స్పందన
కొద్ది వారాల్లోనే భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.దీనిని అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు.