1.హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకుకు ఆర్బీఐ షాక్
హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆర్బిఐ షాక్ ఇచ్చింది.ఆన్లైలైన్ సర్వీసులలో అంతరాయాలు నేపథ్యంలో డిజిటల్ క్రెడిట్ కార్డుల జారీ తాత్కాలికంగా నిలిపివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.
2.రైతు సంఘాలతో కేంద్రం భేటీ
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిదో రోజుకు చేరిన క్రమంలో, గురువారం కేంద్ర ప్రభుత్వం మరోసారి వారితో భేటీ అయింది.
3.కరోనా టీకా పై మోదీ మీ వైఖరి ఏంటి : రాహుల్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఉచితంగా అందిస్తామని ప్రధాని చెప్పారని, ఇప్పుడు టీకా అందిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదు అని కేంద్రం అంటోందని, దీనిపై మీ వైఖరి ఏంటో చెప్పాలి అని ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ డిమాండ్ చేశారు.
4.వారి కోసం ప్రాణాలిస్తా : రజిని
తమిళనాడు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని , రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు.
5.టిడిపి ఎమ్మెల్యే పై జగన్ సీరియస్
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ 3000 ఇస్తామని ప్రకటించారని దాని సంగతి ఏంటి అంటూ టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించగా జగన్ ఆయనపై సీరియస్ అయ్యారు.
6.రేపే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్
సెప్టెంబర్ 1న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాటు చేశారు.రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.
7. ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు టిడిపి ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు.
8.కొడాలి నాని ఇంటి వద్ద భద్రత పెంపు
శాఖ మంత్రి పేర్ని నాని పై దాడి జరిగిన నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ మేరకు గుడివాడలో నానీ ఇంటి వద్ద పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
9.జనవరిలో రజిని కొత్త పార్టీ
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
10.డీజిల్ ఇకపై డోర్ డెలివరీ
టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా ఒక స్టార్టప్ ను ప్రారంభించబోతున్నారు.దీని సాయంతో డీజిల్ వాహనదారులు తమ ఇంటికే డీజిల్ తెప్పించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
11.కేజీఎఫ్ -2 టీజర్ డేట్ ఫిక్స్
కన్నడ నటుడు యాష్ హీరో గా నటించిన కే జి ఎఫ్ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో కేజీ ఎఫ్ 2 ని నిర్మించారు దీనికి సంబంధించిన టీజర్ ను జనవరి 8 న విడుదల చేయబోతున్నారు.
12.2024 లో పోటీ చేస్తా : ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
13.సీసీ టీవీ లపై సుప్రీం సంచలన తీర్పు
జైళ్లు, పోలీస్ స్టేషన్లు , లాకప్ లు, ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
14.మంత్రి పై హత్యాయత్నం .మాజీ మంత్రికి నోటీసులు
ఏపీ మంత్రి ఇ పేర్ని నాని పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో నిందితుడు నాగేశ్వరావు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సెక్షన్ 91 కింద పోలీసులు నోటీసు పంపించారు.
15.Instagram లో న్యూ అప్డేట్
Instagram లైవ్ రూమ్ ద్వారా ఒకేసారి నలుగురు వ్యక్తులు లైవ్ వీడియో లో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు.
16.వికీపీడియా కు కేంద్రం నోటీసులు
భారత్ మ్యాప్ తప్పుగా చూపించిన వికీపీడియా పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది.
17.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో 53,686 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 609 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కరోనా ప్రభావం తో ముగ్గురు మృతి చెందారు.
18.బోరు బావిలో బాలుడు
ఉత్తర ప్రదేశ్, మహోబా జిల్లాలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడి మరణించాడు.
19.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర – 45,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,070.
20.ఐటీ రిటర్న్స్ గడువు పెంపు
ఐతే రిటర్న్స్ ఫైలింగ్ కు జనవరి 31వరకు గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.