1.పెళ్లి వేడుకలో కరోనా కలకలం
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేపింది.పెళ్లికి హాజరైన వారిలో 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
2.దేశంలో ఏడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్
దేశంలో కరోనా వైరస్ విజృంభన రోజురోజుకు పెరుగుతోంది.ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
3.పోలీస్ నియామకాల పేరిట నకిలీ నోటిఫికేషన్
పోలీస్ శాఖ ఖాళీల భర్తీకి నకిలీ నోటిఫికేషన్ వెలువడింది.పోలీస్ శాఖలు ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో ఆయా విభాగాల్లో ఖాళీల భర్తీ పేరుతో నకిలీ నోటిఫికేషన్ వెలువడడంతో సిసిఎస్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
4.ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్
ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో 2021 22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆగస్టు 19 20 తేదీల్లో నిర్వహించేందుకు కేయూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది.సెప్టెంబర్ 17వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని ఐసెట్కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు.
5.చాడ వెంకట్ రెడ్డి కి తృటిలో తప్పిన ప్రమాదం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తృటిలో ప్రమాదం తప్పింది.హనుమకొండలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంను మరో వాహనం ఢీకొట్టడంతో స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డారు.
6.భారత్ లో కరోనా
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తీవ్రతరం అవుతున్నాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 93,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.మావోయిస్టుల దాడి 20 మంది జవాన్ల మృతి
చత్తీస్ గడ్ లో తారేరం లో మావోయిస్ట్ లు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా, 22 మంది మిస్ అయినట్టు అధికార్లు చెబుతున్నారు.
8.తెలంగాణలో కరోనా వైరస్
కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో మరింత పెరుగుతూ వస్తోంది.గడచిన 24 గంటల్లో 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వేణుగోపాల్ రావు
ఏపీ హైకోర్టు ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు శనివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగాయి.అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాలరావు ను హైకోర్టు ఉద్యోగులు ఎన్నుకున్నారు.
10.బాధ్యతలు స్వీకరించిన రమణదీక్షితులు
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
11.మహారాష్ట్రలో లాక్ డౌన్ పై ప్రకటన
మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవుతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు విధించే నిమిత్తం రంగాల్లో నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశం అనంతరం లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువడనుంది.
12.చత్తీస్ ఘడ్ సీఎం కు అమిత్ షా ఫోన్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ కు ఫోన్ చేశారు.బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ పై ఆరా తీశారు.
13.మూడో రోజుకు చేరిన అఖిలపక్ష కార్మిక సంఘాల దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష ,కార్మిక సంఘాలు చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది.
14.ఉపరాష్ట్రపతి కి కోవిడ్ టీకా రెండో డోస్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోవిడ్ టీకా రెండో డోస్ ఢిల్లీ లోని ఎయిమ్స్ లో తీసుకున్నారు.
15.కోవిడ్ కేసుల గుర్తింపుకు కొత్త యాప్
కరోనా వైరస్ లక్షణాల గుర్తింపునకు కొత్త యాప్ ను వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది.దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.
16.ఆసుపత్రి నుంచి రోజా డిశ్చార్జ్
శస్త్ర చికిత్స ల నిమిత్తం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు.
17.విశాఖ ఉక్కు పై పిటిషన్ విచారణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ ఈ నెల 9 న విచారణ కు రాబోతోంది.
18.10న జాతీయ లోక్ అదాలత్
ఈ నెల 10 న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
19.ఏపీకి 1482 కోట్ల ఉపాధి నిధులు
ఏపీకి కేంద్రం నుంచి రూ.1482.31 కోట్ల ఉపాధి హామీ నిధులు విడుదల అయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,910
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,910.