1.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శుక్రవారం తిరుమల శ్రీవారిని 21,972 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
2.‘ సివరేజ్ ‘ యూనియన్ అధ్యక్షుడుగా దాసోజు శ్రవణ్
హైదరాబాద్ వాటర్ వర్క్స్ సీవరేజ్ కామ్ గార్ యూనియన్ అధ్యక్షుడిగా ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రావణ్ ఎన్నికయ్యారు.
3.సజ్జల బెదిరింపు వార్తలు అవాస్తవం : ఏపీఎన్జీవోలు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ లో బెదిరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు.
4.అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాధ రెడ్డి ని కుప్పం కృష్ణగిరి హైవే లో పోలీసులు అరెస్టు చేశారు.
5.‘ మా ‘ ఎన్నికలకు భారీ బందోబస్తు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71 లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరుగుతాయి.
6.దేశంలోనే నంబర్ 1 గా ఏపీ ఆక్టోపస్
ఏపీ పోలీస్ శాఖ కు జాతీయ స్థాయిలో మరో ఘనత దక్కింది.జాతీయ భద్రతా దళ విభాగం ‘ అగ్ని పరీక్ష -7 పేరుతో హర్యానాలో ఈ పోటీలు నిర్వహించింది.
ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు వివిధ ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ్ , శారీరక దారుఢ్య పోటీలు నిర్వహించారు.వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బృందానికి మొదటి స్థానం దక్కింది.
7.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.ఉదయం సింహ వాహనంపై స్వామి వారి ఊరేగింపు జరుగుతోంది.
8.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 48,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.పవన్ తో నటించబోతున్న పూజా హెగ్డే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే నటించబోతోంది.ఈ విషయాన్ని దర్శకుడు లీక్ చేశాడు.
11.ప్రధానికి ఏపీ సీఎం లేఖ
ఇంధన ధరల పెరుగుదల , విద్యుత్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.
12.ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా తమన్నా
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ ఎవరు మీలో కోటీశ్వరులు ‘ షో కు గెస్ట్ గా పాపులర్ బ్యూటీ తమన్నా భాటియా రానున్నారు.
13.‘ మాయోన్ ‘ టీజర్ రిలీజ్ చేసిన రానా
సీబీ సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధ రవి కీలక పాత్రలో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న ‘ మాయోన్ ‘ చిత్ర టీజర్ ను హీరో దగ్గుపాటి రాణా ఆవిష్కరించారు.
14.బాలయ్య కాలికి గాయం
హీరో నందమూరి బాలకృష్ణ కాలికి చిన్నపాటి గాయం అయింది షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీ బాలయ్య యధావిధిగా షూటింగ్ లో పాల్గొన్నారు.
15.బద్వేల్ ఉప ఎన్నికలు
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల లో పోటీకి మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి.
16.మా ఎన్నికల పై పోలీసులకు జూనియర్ ఆర్టిస్టుల ఫిర్యాదు
వాటర్ జాబితా లో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘ మా ‘ ఎన్నికలు నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
17.సినీ గోయర్స్ అవార్డుల ప్రధానం
మాదాపూర్ లోని శిల్పకళావేదికలో సినీగోయర్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై , హీరో నాని హాజరయ్యారు.
18.కోస్తాంధ్రకు మరో తుఫాను
ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారుతుంది.ఈ ప్రభావంతో ఈ నెల 13 , 14 తేదీల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
19.గ్రామాల వారీగా బడ్జెట్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామపంచాయతీ బడ్జెట్ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, వేరువేరుగా బడ్జెట్లు రూపొందించుకోవాలి అని కలెక్టర్లు , డి పి ఓ లకు, జెడ్పీ సీఈవోలకు ఆదేశాలు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,940 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,940
.