1.భారీ వర్షాలపై కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
2.టాలీవుడ్ డ్రగ్స్ కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడి అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.ఈ రోజు హీరో నందు ను ఈడి అధికారులు విచారిస్తున్నారు.
3. ఓటుకు నోటు కేసు సుప్రీం లో విచారణ
ఓటుకు నోటు కేసులో టి.పిసిసి చీఫ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిటిషన్లపై సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది.
4. ఢిల్లీ పర్యటనలో నే కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఢిల్లీ పర్యటన ఉన్నారు.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 22,896 మంది భక్తులు దర్శించుకున్నారు.
6.పీజీ ఈ సెట్ ఫలితాల విడుదల
తెలంగాణ లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఈసెట్ 2021 ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు.
7.జేఈఈ ప్రోవిజినల్ కీ విడుదల
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబందించిన ప్రోవిజినల్ కీ ని విడుదల చేశారు.
8.పౌండేషన్ స్కూళ్ల పై జగన్ సమీక్ష
నాడు నేడు లో భాగంగా ఫౌండేషన్ స్కూల్ పై నేడు ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
9.పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు
విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
10.జగన్ రోడ్లపై తిరగలి : రఘురామ
ఏపీ సీఎం జగన్ హెలికాఫ్టర్ పై తిరగడం కాదని, రోడ్లపై తిరిగి రోడ్ల దుస్థితి ని మెరుగుపరచాలని వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
11.గణేష్ పండుగ జరిపి తీరుతాం
ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినఎకపోయినా గణేష్ పండుగలను జరిపి తీరుతాం అని ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
12.మిషన్ పుంగనూరు : మంత్రి అప్పలరాజు
పుంగనూరు జాతి పశువుల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు.
13. ఏపీ గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కలిశారు వినాయక చవితి వేడుకలకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరణ పై ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.
14.తిరుపతి లో రాజీవ్ గాంధీ విగ్రహం కు అవమానం
తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది.విగ్రహం తల పై చెప్పులు ఉండటం కలకలం రేపుతోంది.
15.రేపు కిర్లంపూడి లో జాబ్ మేళా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వికాస ఆధ్వర్యంలో కిర్లంపూడి సివి రామన్ జూనియర్ కళాశాలలో ఈ నెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పి డి కరణం లచ్చారావు తెలిపారు.
16.వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
చిట్ ఫండ్ కేసులో అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రసాద్ ను ఒడిశా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
17.గృహ నిర్బంధంలో మెహబూబా ముప్తి
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా మాఫ్తిని మంగళవారం పోలీసులు గృహ నిర్బంధంలో మళ్లీ పెట్టారు.
18.పెగసెస్ వివాదం : సుప్రీం విచారణ
పెగాసస్ స్నూపింగ్ వివాదం పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఈనెల 13వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
19.తుంగభద్ర నదిలో మొసళ్ళ సంచారం
కర్ణాటకలోని రాయచూరు జిల్లా సరిహద్దులోని తుంగభద్ర నదిలో ధడేసుగూరు క్యాంప్ వద్ద సోమవారం ఒకేసారి 20 మొసళ్ళు ప్రజలకు కనిపించాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,410 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,410