1.ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం : పువ్వాడ
నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ ని ప్రైవేటుపరం చేసే ఆలోచన ఏదీ తెలంగాణ ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
2.ఎన్నికల కమిషనర్ ను కలవనున్న షర్మిల
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్ ను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు.
3.నల్గొండ లు గవర్నర్ తమిళ సై
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లా కు చేరుకున్నారు.
4.హెటిరో ఫార్మా ఫై కొనసాగుతున్న ఐటీ దాడులు
హైదరాబాద్ లోని హెటిరో ఫార్మా పై ఐటి అధికారులు గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు.
5.దిశ కేసులో సుప్రీం కోర్టు హై పవర్ కమిషన్ విచారణ
విశాఖ కేసులో సుప్రీంకోర్టు హైపవర్ కమిషన్ విచారణ జరగనుంది.నేడు దిశ కమిషన్ విచారణకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ హాజరయ్యారు.
6.ఎన్.ఐ.ఏ కు గుజరాత్ ముంద్రా పోర్ట్ హెరాయిన్ కేసు
గుజరాత్ ముంద్రా పోర్ట్ లో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిన వ్యవహారంలో డిఆర్ఐ నమోదు చేసిన కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐ ఏ కు అప్పగించింది.
7.కుట్టు , బ్యూటీషియన్ కోర్సు లో ఉచిత శిక్షణ
హైదరాబాద్ లోని బడంగ్ పేట్ కార్పొరేషన్ లోని కేశవరెడ్డి నగర్ లో సహోదరి పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు, యువతులకు స్వయం ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ఉచితంగా కుట్టు, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ అధ్యక్షురాలు స్వర్ణలత తెలిపారు.మరిన్ని వివరాలకు 9985055855 లో సంప్రదించాలని ఆమె కోరారు.
8.స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు చైర్మన్ లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు చైర్మన్ లను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
9.ప్రభుత్వంపై ఏపీఎన్జీవోలు ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం తీరుపై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
10.ఒంగోలులో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఈరోజు ఒంగోలు జిల్లాలో పర్యటించారు.
11.బద్వేల్ బీజేపీ అభ్యర్థిగా సురేష్
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పంతల సురేష్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.
12.శ్రీశైలం లో దసరా మహోత్సవాలు
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
13.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 21, 784 మంది భక్తులు దర్శించుకున్నారు.
14.ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
15.గోపాల మిత్రుల దశలవారీ ఆందోళన
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించినట్లు ఏపీ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.
16.కెసిఆర్ పై ఫీల్డ్ అసిస్టెంట్ ల ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులపై ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హుజురాబాద్ లో నామినేషన్ వేయకుండా అడుగడుగునా పోలీసులు అడ్డు పడుతుండడం తో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
17.ఏపీ ప్రభుత్వంపై రఘురామ విమర్శలు
ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు చేస్తోందని వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
18.బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకాగాంధీ తొలగింపు
కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ని బిజెపి కేంద్ర కమిటీ నుంచి తొలగించారు.
19.పూణే ఎయిర్ పోర్ట్ మూసివేత
పూణే ఎయిర్ పోర్ట్ ను 14 రోజుల పాటు మూసివేయనున్నారు.ఎయిర్ పోర్ట్ లో రైల్వే పనులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,900
.