1.కార్వీ కేసులో రంగంలోకి ఈడి
కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది.
2.పెరిగిన మెట్రో రైళ్ల సమయం
మెట్రో రైలు రాకపోకలు సమయాన్ని అధికారులు పొడిగించారు ఎప్పుడు వరకు ఉదయం 7.10 నుంచి రాత్రి 9.45 వరకు మాత్రమే రైలు నడిచేవి.అయితే ఈ సమయాన్ని 11:15 వరకు పెంచారు.
3.లోయర్ మానేరు డ్యామ్ 16 గేట్లు ఎత్తివేత
కరీంనగర్ జిల్లా లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
4.కెసిఆర్ పై మధుయాష్కి విమర్శలు
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఏడేళ్లలో విభజన హామీలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు అంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ప్రశ్నించారు.
5.జూరాల ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టు కు క్రమక్రమంగా పెరుగుతోంది.అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
6. గ్రేటర్ హైదరాబాద్ కు ఆరెంజ్ అలెర్ట్
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.దీంతో హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
7.టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల సర్వసభ్య సమావేశం ఈనెల ఏడో తేదీన పీవీ నరసింహారావు మార్గంలోని జలవిహార్ లో జరగనుంది.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం తిరుమల శ్రీవారిని 23,081 మంది భక్తులు దర్శించుకున్నారు.
9.8న బీసీల శంఖారావం
హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల శంకారావం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
10.జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
ఏపీ సీఎం జగన్ కు బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.కరుణ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య ,వినోద కార్యక్రమాలతో పాటు , రాజకీయ పార్టీల సమావేశాలు, జయంతి ,వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతించాలని కోరారు.
11.జగన్ ను కలిసిన మంచు మనోజ్
ఏపీ సీఎం జగన్ యంగ్ హీరో మంచు మనోజ్ కలిశారు.ఈ విషయాన్ని మనోజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
12.షర్మిల నిరుద్యోగ దీక్ష
రేపు మహబూబ్ నగర్ జిల్లా లో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు.
13.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 1,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగ230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.రోడ్లు, పోర్ట్ లు, ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం పై జగన్ సమీక్ష
రోడ్లు , పోర్ట్, ఎయిర్ పోర్టుల నిర్మాణం పై ఏపీ సీఎం జగన్ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
17.వాహనాల ధరలు పెంచిన మారుతి సుజుకి
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తమ కంపెనీ నుంచి వస్తున్న కార్ల ధరను నేటి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది.అన్ని రకాల మోడళ్ల పై ఎక్స్ షోరూమ్ ధర ను 1.9 శాతం పెంచింది.
18.కృతి శెట్టి తో సినిమా .నో చెప్పిన సేతుపతి
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది అయితే ఆ సినిమాలో హీరోయిన్గా తీసుకునేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తుండగా ఆమెతో నటించేందుకు హీరో విజయ్ సేతుపతి నిరాకరించారు.ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కూతురి పాత్రలో కృతి శెట్టి నటించడమే దీనికి కారణం.
19.భవానీపుర్ ఎన్నికల బరిలో మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతా లోని భవనీపుర్ ఉప ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,420 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,420 .