న్యూస్ రౌండప్ టాప్ - 20

1.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

2.రాష్ట్ర హాకీ క్రీడాకారులకు ఒక్కొక్కరికి కోటి

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా , తమ రాష్ట్రానికి చెందిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మిత్ సోది గురువారం ప్రకటించారు.
 

3.కరోనా పై అమెరికా ఆందోళన

  కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది అమెరికాలో ప్రస్తుతం భారీగా కేసులు నమోదు అవుతున్నాయి దేశవ్యాప్తంగా రోజుకు లక్ష వరకు కేసులు నమోదు కావడంతో పాటు వేగంగా డెల్టా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో అమెరికా సిడిసి డైరెక్టర్ ఆంటోనీ కౌశిక్ ఆందోళన చెందుతున్నారు.
 

4.పోస్టర్ డోసులు అప్పుడే వద్దు : డబ్ల్యుహెచ్వో

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  కరోనా నుంచి రక్షణ పొందేందుకు బూస్టర్ డోసులని ఇచ్చేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తుండడం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది అప్పుడే బూస్టర్ డోసులు వద్దని వారిస్తోంది.
 

5.పూణేలో జికా వైరస్

  కేరళ లో వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే తాజాగా మహారాష్ట్రలోనూ జికా వైరస్ కేసును అధికారులు గుర్తించారు.పూణే జిల్లాలోని బెల్సర్ గ్రామంలో ఓ మహిళలో జిక వైరస్ లక్షణాలు బయట పడినట్లు అధికారులు తెలిపారు.
 

6.హీరో ధనుష్ పై మద్రాసు కోర్టు ఆగ్రహం

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2015లో దాన్ని అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అందుకుగాను చెల్లించాల్సిన పన్నును నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అప్పట్లోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా దానిని పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

సామాన్య ప్రజలు పన్ను కడుతున్నప్పుడు విఐపిలకు ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నించింది.లగ్జరీ కారు కొనుగోలు చేసి పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారు అని నిలదీసింది.
 

7.పంజాబ్ సీఎం సలహాదారుగా తప్పుకున్న పీకే

  పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రధాన సలహాదారు పదవికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశర్ రాజీనామా చేశారు.
 

8.‘దళిత బంధు ‘ జీవో విడుదల

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  తెలంగాణలో దళిత బంధు అమల్లోకి వచ్చింది యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి ఈ పథకం ప్రారంభించారు.దీనికి సంబంధించి గురువారం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
 

9.నేటి నుంచి టీ సాట్ లో పోలీస్ పోటీ పరీక్షల పై ప్రత్యేక ప్రచారాలు

  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీసు ఉద్యోగాలు పోటీ పరీక్షలకు టీ – సాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఈ నెల 5 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు.
 

10.నీట్ దరఖాస్తు గడువు పెంపు

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష ( నీట్ ) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది.ఆగస్టు 10 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
 

11.ఇంటర్ లో ఎన్ సీ సీ

  ఇంటర్మీడియట్ కాలేజీ లో ఎన్సిసి ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై ఇంటర్ బోర్డు మెమోను జారీ చేసింది.
 

12.ఉర్దూ వర్సిటీకి 9 వరకు దరఖాస్తులు

  హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.ఆగస్టు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.
 

13.తెలుగు మహిళ ఇన్చార్జిగా సుహాసిని

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో పరువు విభాగాలకు ఇన్చార్జ్ నియమిస్తూ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఉత్తర్వులు ఇచ్చారు.తెలుగు మహిళా విభాగానికి నందమూరి సుహాసినిని నియమించారు.
 

14.రోజాకు రోజా లతో సత్కారం

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల నిమిత్తం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు .ఈ సందర్భంగా తట్నేరి దళితవాడ రోడ్డును ఆమె ప్రారంభించారు.జగనన్న కాలనీలో గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్ధిదారులకు వైయస్సార్ క్రాంతి పథకం కింద ఒక్కొక్కరికి 30 వేలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు రోజా లతో ఆమెకు పూలాభిషేకం చేశారు.
 

15.పూరి ఆలయం 15 నుంచి పునఃప్రారంభం

  పూరి లోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఈ నెల 15 నుంచి భక్తులకు అనుమతి ఇవ్వబోతున్నారు.
 

16.ఒడిశా నేషనల్ పార్క్ పునః ప్రారంభం

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  ఒడిషాలోని భితార్ కనిక నేషనల్ పార్క్ ను గురువారం నుంచి పునః ప్రారంభించారు.
 

17.తుంగభద్ర డ్యాం సందర్శనం నిలిపివేత

  కరుణ కారణంగా తుంగభద్ర డ్యామ్ ను చూసేందుకు పర్యాటకులు రావద్దని జిల్లా అధికారి మాలపాటి పవన్ కుమార్ కోరారు.
 

18.కరోనా నుంచి కోలుకున్న సింహాలు

  తమిళనాడులోని వండలూరు జంతుప్రదర్శనశాలలో కరోనా వైరస్ ప్రభావం కు గురైన సింహాలు కోలుకున్నయని అధికారులు తెలిపారు.
 

19.జైలు నుంచి దేవినేని ఉమా విడుదల

Telugu Ap Telangana, Devineni Uma, Malapatipawan, Odishanational, Suhasini, Gold

  మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి గురువారం విడుదలయ్యారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,970   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 47,970            

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube