1.సంగీత నృత్య పరీక్షలు
తెలంగాణ ఏపీ లోని ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల , కళాశాలలో 2019 20 లో సర్టిఫికెట్, డిప్లమో కోర్సులు చదివిన రెగ్యులర్ , ప్రైవేట్ విద్యార్థులకు సిద్ధాంతం, ప్రయోగికం వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు.ఆగస్టు 16, 17, 18 ఏది లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఆచార్య రమేష్ తెలిపారు.
2.బిజెపి మహిళా మోర్చా వర్క్ షాప్
హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో జాతీయ మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్ షాప్ ప్రారంభమైంది.
3.మోడల్ స్కూళ్ల టీచర్లకు పీఆర్సీ అమలు
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడానికి శుక్రవారం తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు.
4.ఉత్తమ టీచర్ అవార్డు లకు దరఖాస్తులు
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లకు టీచర్ల నుంచి తెలంగాణ పాఠశాల విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది అని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి తెలిపారు.
5.ఆర్ జె సి సెట్ రెండో జాబితా విడుదల
సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి ఆర్ జె సి సెట్ రెండో జాబితాను అధికారులు విడుదల చేశారు.
6.ఈటెల రాజేందర్ కోసం పూజలు
పాదయాత్ర చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7.ఆగస్టు 25 నుంచి ములాఖత్ లు పునః ప్రారంభం
కువైట్ కారణంగా గత 16 నెలలుగా నిలిపివేసిన ఖైదీల ములాఖాత్ లను చంచల్ గూడా, చర్లపల్లి ఆగస్టు 25 నుంచి ప్రారంభించడానికి జైలు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
8.విజయసాయిరెడ్డి బెయిల్ పై రఘురామ స్పందన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పై ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయమని సోమవారం సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తానని రఘురామ అన్నారు.
9.ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా శేషగిరిరావు
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరిరావు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ప్రమాణస్వీకారం చేశారు.
10.టిడిపి మాజీ మంత్రి ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న రవీంద్ర ని పోలీసులు అడ్డుకున్నారు.ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీలు లేదంటూ పోలీసులు చెప్పడంతో, తణుకు నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏంటంటే రవీంద్ర పోలీసులను ప్రశ్నించారు.దీనిపై రవీందర్ కు మద్దతుగా భారీ స్థాయిలో కార్యకర్తలు తరలి రావడంతో తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
11.తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు
తెలంగాణ తో సహా 17 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కరుణ కేసులు నమోదయ్యాయని కేంద్రం నిన్ననే ప్రకటించింది.ఇందులో తెలంగాణలో 2 ఆంధ్రప్రదేశ్ లో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది.
12.పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్ట్ లేఖల కలకలం
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఏజెన్సీలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి.
కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సచివాలయం నోటీసు బోర్డు పై మావోయిస్టు పార్టీ , భారత కమ్యూనిస్టు పార్టీ పేరు ఎర్ర బ్యానర్ పై రెండు లేఖలు వెలిశాయి.నర్సరీల పేరుతో సిండికేట్ గా ఏర్పడి చిన్నచిన్న నర్సరీలు నడుపుతున్న రైతులకు అన్యాయం చేస్తున్న వారిని లేఖలో హెచ్చరించారు.
13.జేసిజే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జూనియర్ సివిల్ జడ్పీ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 17,030 మంది భక్తులు దర్శించుకున్నారు.
15.రష్యా నేవీ తో కలిసి భారత్ విన్యాసాలు
రష్యా మే బి తో కలిసి భారత నౌకాదళం బాల్టిక్ సముద్రం లో రెండు రోజులు ‘ ఇంద్ర నేవీ – 2021 విన్యాసాలు చేసింది.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్త గా 41, 649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.జగన్ బెయిల్ రద్దు పై తీర్పు
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి, బెయిల్ పై ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై తీర్పును సీబీఐ కోర్టు 25వ తేదీ కి వాయిదా వేసింది.
18.తెలుగు రాష్ట్రాలకు ‘ గోదావరి బోర్డ్ ‘ లేఖ
ఏపీ, తెలంగాణలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డ్ శుక్రవారం లేఖ రాసింది.ఆగస్ట్ 3 న నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కోరింది.
19.ఉద్యోగులపై టీటీడీ చర్యలు
ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది.ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,390 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,390
.