1.ఖమ్మం జిల్లాలో లోకేష్ కు స్వాగతం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
2.వైఎస్ షర్మిల పరామర్శ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల మంగళవారం గజ్వేల్ మండలం అనంతరావు పల్లె కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న కొప్పుల రాజు కుటుంబసభ్యులను పరామర్శించారు అనంతరం ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు.
3.మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.సోమవారం తిరుమల శ్రీవారిని 22,839 మంది భక్తులు దర్శించుకున్నారు.
5.ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన
దక్షిణ చత్తీస్గడ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడడం తో ఆ ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
6.నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త
నర్సింగ్ కోర్సులు చేసిన ఎస్సీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పరీక్షలకు హాజరయ్యేందుకు ఉచితంగా ఇస్తున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ నర్స సంస్థల ఎండి సునీత తెలిపారు.
7.జైళ్లశాఖ ఐజి గా రాజేష్
తెలంగాణ జైళ్ల శాఖ ఈజీగా వై రాజేష్ కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
8.టెన్త్ మార్కుల మెమోలు సిద్ధం
పదో తరగతి మార్కులు మెమోలను తెలంగాణ అధికారులు సిద్ధం చేశారు.స్కూలు ప్రారంభం కాగానే మెమోలను విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించారు.
9.చిత్తూరులో ఏనుగుల గుంపు
చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం మల్లికుంట పరిసరాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది.
10.ఏపీ అసెంబ్లీ లో సభా హక్కుల కమిటీ భేటీ
ఏపీ అసెంబ్లీ లో సభా హక్కుల కమిటీ మంగళవారం భేటీ అయింది.చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
11.కేసు నమోదు చేసే ధైర్యం ఉందా : అచ్చెన్న
టీడీపీ నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతల లిస్ట్ తమ దగ్గర ఉందని, వారి పై సుమోటో గా కేసు నమోదు చేసి ధైర్యం ఉందా అంటూ డీజీపీ కి సవాల్ విసిరారు.
12.విశాఖ కేంద్రంగా పరిపాలన
విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
13.చిరుతల సంచారం
కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం పులికనుమ ప్రాజెక్టు కొండల్లో 3 చిరుతపులులు సంచరిస్తుండడం కలకలం రేపుతోంది.
14.ఏపీలో కొనసాగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.
15.మంత్రి బొత్స పై దళిత జేఏసీ ఫిర్యాదు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అమరావతి దళిత జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.
16.డ్రగ్స్ కేసు.
విచారణకు హాజరైన పూరి జగన్నాథ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.ఈ విచారణ కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 30,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.తెలంగాణలో భారీగా ఐఎఎస్ ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
19.ఎన్టీఆర్ తో విభేదాల పై బండ్ల గణేష్ స్పందన
ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ నిర్మించిన సినిమాల విషయంలో రెమ్యునరేషన్ వద్ద ఇద్దరి మధ్య ఇద్దరికీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అనే వార్తలపై బండ్లగణేష్ స్పందించారు.తనకు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు తలెత్తినా, అది చిన్న సమస్య అని, ఇప్పుడు తమ వద్ద ఎటువంటి విభేదాలు లేవని గణేష్ క్లారిటీ ఇచ్చారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,490 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,490.
.