1.కేసిఆర్ ఢిల్లీ టూర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు పొడిగించారు.ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి శాఖ శేకవత్ తో కేసీఆర్ భేటీ అయ్యారు.
2.ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు
ఏపీలో రాత్రి పూట శీను మరికొంత కాలం పొడిగించాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11 నుంచి ఆరు గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.
3.రకుల్ ను విచారిస్తున్న ఈడి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.ఈరోజు రకుల్ ప్రీతిసింగ్ ను అధికారులు విచారిస్తున్నారు.
4.టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా మాజీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జానార్ బాధ్యతలు స్వీకరించారు.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 23, 832 మంది భక్తులు దర్శించుకున్నారు.
6.అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ప్రవేశపరీక్ష
ఎంబీఏ లో ప్రవేశం కోసం ఈ నెల 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
7.కాంగ్రెస్ ఉద్యమాల కమిటీ సభ్యుడిగా ఉత్తమ్
దేశవ్యాప్తంగా ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించి కమిటీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నియమించింది.
8.గోదావరి బోర్డ్ సభ్యుడిగా రంగరాజన్
గోదావరి నది యాజమాన్యం బోర్డు సభ్యుడిగా ఆర్.ఎం రంగరాజన్ నియమితులయ్యారు.
9.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వస్తుంది కొత్తగా 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వికారాబాద్ జిల్లాలో కొనసాగుతోంది..
11.ఎన్ హెచ్ ఆర్ సి కి వర్ల రామయ్య లేఖ
ఎన్ హెచ్ ఆర్ సి కి టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.పెట్రోల్ ధరలు పై నిరసన చేస్తున్న టిడిపి శ్రేణులపై అక్రమంగా ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
12.తమిళనాడు అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ‘ ట్వీట్ ‘
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్, చిరంజీవి స్టాలిన్ భేటీపై ఆ రాష్ట్ర శాసన సభలో చర్చ జరిగింది.
13.సీఎస్ను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వకులా భరణం కృష్ణమోహన్ కమిషన్ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిశారు.
14.తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్ పై హై కోర్టు లో విచారణ
తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై హై కోర్టు లో విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
15.డ్రగ్స్ కేసు పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ అనేది ఒక సెలబ్రిటీ ఇష్యూ మాత్రమే కాదని, పొలిటికల్ బార్డర్ ఆర్థికపరమైన ఇష్యూ అని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
16.’ జాతీయ రహదారి ‘ ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్.జి.వి
మధు చిట్టే , సైగల్ పాటిల్, మమత, ఉమా భారతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన జాతీయ రహదారి సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు.
17.మద్యపాన నిషేధం ఏమైంది
ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మధ్యపానాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ? జగన్ తీసుకొస్తాను మద్యపాన నిషేధం ఎక్కడ ఉంటుంది టీడీపీ మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.
18.మహారాష్ట్రకు థర్డ్ వేవ్ ముప్పు
కరుణ థర్డ్ న్యూ అవకాశాలు ఉండడంతో సీఎం మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి తిరిగి లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేసే ఆలోచనలో ఉంది.
19.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 45,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,200