1.ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు పై కమిటీ
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్ గా 18 సభ్యులతో కమిటీ ఏర్పాటు అయ్యింది.
2.హైదరాబాద్ లో 5 జి నెట్ వర్క్ ట్రైల్ రన్
5 జి నెట్వర్క్ కు సంబంధించిన పరికరాలు నెట్వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.
3.వరి ధాన్యం కొనుగోలు పై మధు యాష్కీ కామెంట్స్
వరి ధాన్యం కొనుగోలు పెద్ద స్కామ్ అంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
4.రేవంత్ రెడ్డి కామెంట్స్
ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
5.ఓవైసీ – మిథాని ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ లోని ఒవైసీ మిథాని జంక్షన్ లో ఫ్లైఓవర్ ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
6.తీన్మార్ మల్లన్న పై మరో ఫిర్యాదు
మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ పై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న కు చెందిన వెబ్ ఛానల్ లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పై కంటోన్మెంట్ బోర్డ్ వార్డ్ -7 మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
7.సింహంను దత్తత తీసుకున్న పీజేఆర్ కుమార్తె లు
దివంగత మాజీ సి ఎల్ పి నేత పీజేఆర్ కుమార్తె లు విజయ రెడ్డి , పావని రెడ్డి లు పీజేఆర్ ఫౌండేషన్ తరపున హైదరాబాద్ జూ పార్క్ లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు.
8.గోదావరిలో ఆదివాసీ మహిళల వినూత్న నిరసన
తెలంగాణలోని ములుగు జిల్లా లోని గోదావరి నదిలో ఆదివాసీ మహిళలు నిరసన చేపట్టారు.తమ సొసైటీలకు వచ్చిన ఇసుక ర్యాంప్ అనుమతిని శ్యాండ్ మాఫియా రద్దు చేయించింది అంటూ నిరసనకు దిగారు.
9.ఉపాధ్యాయుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా అధికారులు చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆందోళనకు దారి తీసింది.సరైన సమాచారం ఇవ్వకుండానే ఆప్షన్లు ఇవ్వాలని చెప్పడంపై ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
10.వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
11.పట్టణాలు అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ : కేటీఆర్
పట్టణాలలో మౌలిక సదుపాయాలు , అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.
12.నేటి నుంచి రైతు బంధు
నేటి నుంచి తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ములు పడనున్నాయి.
13.జగ్గారెడ్డి వ్యాఖ్యలపై వీహెచ్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు సమర్థించారు.
14.వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరికలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీలో పలు పార్టీలకు చెందిన నాయకుల చేరికలు చోటు చేసుకున్నాయి.షర్మిల సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు.
15.52.88 లక్షల టన్నుల ధాన్యం సేకరణ : కేంద్రం
తెలంగాణ నుంచి అక్టోబర్ ,డిసెంబర్ 26 మధ్య 52.88 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది.
16.ఎల్ఐసి ఛైర్మన్ కు కోర్టు ధిక్కార నోటీసులు
ఎల్ఐసి ఛైర్మన్ కు కోర్టు ధిక్కార నోటీసులు అందాయి.కోర్టు ధిక్కరణ కేసులో ఎల్ఐసి ఇండియా ఛైర్మన్ ఎమ్మార్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
17.కుల గణన చేపట్టాలి : బీసీ కమిషన్ ఛైర్మన్
జనగణన లో కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నివేదించాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు.
18.యూ ట్యూబ్ ఛానెళ్ల పై ఐటీ శాఖ ఫిర్యాదు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని యూ ట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ యూ ట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
19.బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా అలోక్ కుమార్
బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా అలోక్ కుమార్ నియమితులు అయ్యారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,220
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,220
.