1.బీసీ బంధు అమలు చేయాలి
తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు.
2.8 కొత్త మెడికల్ కాలేజీలో కోసం దరఖాస్తు
తెలంగాణ లో కొత్తగా 8 వైద్య కళాశాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
3.‘తెలుగు’ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
2021 22 విద్యాసంవత్సరానికి సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోని రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి శనివారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
4.ఫీజుల నియంత్రణ పై హైకోర్టులో పిల్
తెలంగాణలో ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ వ్యవస్థ లేదని ఫీజుల రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
5.నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ మూడున్నరేళ్ల కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి ఎస్ నారాయణ తెలిపారు.
6.నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం 2021 22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆదివారం ఎంట్రన్స్ ను నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ క్యాన్సర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి తెలిపారు.
7.నేడు ట్రేసా రాష్ట్రస్థాయి సమావేశం
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాల రెవెన్యూ అధికారులు హైదరాబాద్ శివారులోని ఓ హోటల్లో నేడు సమావేశం కానున్నారు.
8.సీఎం ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
9.జార్ఖండ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా గోవాకు ప్రత్యేక రైలు
గోవా కి వెళ్లే ప్రయాణికుల కోసం జార్ఖండ్ నుంచి సికింద్రాబాద్ లో కొత్త రైలు ప్రారంభం కానుంది.ఈనెల 28న జార్ఖండ్లోని జసిడి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ప్రారంభమై గోవాలోని వాస్కోడిగామా కు వెళ్లనుంది.
10.గులాబ్ తుఫాన్
ఉత్తరాంధ్ర తెర వైపు గులాబ్ తుఫాన్ దూసుకొస్తోంది.గోపాల్ పూర్ కు ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తూర్పు దిశగా 490 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది.
11.పవన్ పై మంత్రి వెల్లంపల్లి విమర్శలు
జనసేన పవన్ కళ్యాణ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సమస్యలు చేశారు.పావలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని మంత్రి వ్యాఖ్యానించారు.
12.ట్యాంక్ బండ్ పై ఎస్పీ బాలు సంస్మరణ వేదిక
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ ఈరోజు సాయంత్రం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ కు వేదిక కానుంది.
13.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.‘శ్యామ్ సింగ రాయ్ ‘ డబ్బింగ్ రైట్స్
‘ శ్యామ్ సింగ రాయ్ ‘ హిందీ డబ్బింగ్ రైట్స్ ను B4U దక్కించుకుంది.డిజిటల్ రైట్స్ ను నెటి ఫ్లిక్స్ దక్కించుకుంది.
15. భారత్ బంద్ కు వైసీపీ మద్దతు
దేశ వప్తంగా కొనసాగుతున్న రైతు ఆందోళనకు ఇచ్చేందుకు సంయుక్త కిసాన్మోర్చా సెప్టెంబర్ 27వ తేదీన భారత్ బంద్ కు సిద్ధమవుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు బంద్కు మద్దతు తెలపగా వైసీపీ కూడా మద్దతు పలికింది.
16.జగన్ పై వీర్రాజు విమర్శలు
కాంగ్రెస్ వామపక్ష రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
17.ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు.
18.తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణలో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
19.త్వరలో ఆన్లైన్ లో సెమిస్టర్ పరీక్షలు
విద్యార్థుల సౌకర్యం కోసం కొత్త పరీక్షా విధానం జేఎన్టీయూ ప్రవేశపెట్టింది.త్వరలోనే ఆన్లైన్ విధానంలో సెమిస్టర్ పరీక్షలను ప్రవేశపెట్టనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,130
.