1.గరగపర్రు లో మరోసారి దళితులు ఆందోళన
గరగపర్రు లో మరోసారి దళితులు ఆందోళనకు దిగారు.గరగపర్రు లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ర్యాలీ,రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
2.కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశలు
తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన మహావీర్ కళాశాలలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
2.జగిత్యాల లో రైతుల ర్యాలీ, మహాధర్నా
జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ, మహాధర్నా ప్రారంభమైంది.పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ర్యాలీ నిర్వహించారు.
3.పులి ట్రాకింగ్ కోసం అధికారుల చర్యలు
కొత్తగూడా గూడూరు అడవుల్లో ట్రాకింగ్ కోసం అధికారులు అనేక చర్యలు చేపట్టారు.8 ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
4.వివేకా హత్య కేసు
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
5.ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం అయ్యాయి.
6.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.గురువారం తిరుమల శ్రీవారిని 24, 378 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
7.మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం
మహబూబాబాద్ జిల్లా లో పులి సంచారం కలకలం రేపుతోంది ఇప్పటికే అనేక పశువుల పై. దాడి చేసి హతమార్చడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
8 28 నుంచి ఐ సెట్ ప్రత్యేక కౌన్సిలింగ్
ఈ నెల 28 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ ఈ ప్రక్రియ ఈ నెల 28 నుంచి మొదలవుతుంది.
9.మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో బెదిరింపులు
మానవ హక్కుల సంఘం ట్రస్ట్ చైర్మన్ పేరుతో ఠాగూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి బెదిరింపులకు జగన్ పై కొంత మంది గిరిజనులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
10.నేడు కేంద్ర మంత్రి తో తెలంగాణ మంత్రుల భేటీ
తెలంగాణ లో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ఈ రోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు భేటీ కానుంది.
11.ఏపీకి వర్ష సూచన
ఈరోజు రేపు రాయలసీమ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి , భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
12.విజయసాయి రెడ్డి కామెంట్స్
ఏపీలో ఒకపక్క వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.
13.శాసనమండలి సమావేశాలు
ఈరోజు ఉదయం 10 గంటలకు ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
14.చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
చిత్తూరు జిల్లాలో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది.వరద నష్టానికి పరిశీలించి నివేదిక త్వరలోనే ఇవ్వనుంది.
15.టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం రెండున్నర గంటలకు టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం మొదలైంది.
14.రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల ధరల తగ్గింపు
రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రైల్వేశాఖ తగ్గించింది.ఇక నుంచి టికెట్ ధర పది రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు.
15.వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది.
16.మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ పిలుపు
మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది.
17.ఏపీ మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా జకీయా, ఖానం
ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పర్సన్ గా జకియా ఖానం నామినేషన్ దాఖలు చేశారు.
18.టిఆర్ఎస్ కు గట్టు రామచంద్ర రావు రాజీనామా
టిఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత గట్టు రామచందర్ రావు రాజీనామా చేశారు.
19.వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
వరంగల్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా టిఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,850 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,930