1.తలవెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు
తలవెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసి తలవెంట్రుకలను ఇతర దేశాలకు కొనుగోలు చేస్తున్న ముఠా పై ఈడి ఆరా తీస్తోంది.
2.కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కేసులో దర్యాప్తు ముమ్మరం
కార్వీ సక్ బ్రోకింగ్ కంపెనీ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కార్ వి ఎం డి పార్థసారథిని సిసిఎస్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు.
3.జగన్ బెయిల్
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది .తుది తీర్పు ను వచ్చే నెల 15 కు వాయిదా వేసింది.
4.రేవంత్, సండ్రలకు ఊరట
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.ఓటుకు నోటు కేసు సీబీఐ కోర్టు పర్ధిలోకి రాదు అంటూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
5.ఇంకా ఏ పార్టీలోనూ తాను చేరలేదు : ఇందిరా.శోభన్
వైఎస్సార్ టిపి కి రాజీనామా చేసిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదని, చేరే ఆలోచన లేదు అని ఇందిరా సోబన్ క్లారిటీ ఇచ్చారు.
6.హుజురాబాద్ లో గెలుపు మాదే : రాములమ్మ
హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రమే గెలుస్తారు అని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు.
7.నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు 30 వరకు దరఖాస్తులు
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు ఈ నెల 31 వరకు దరఖాస్తు లు చేసుకోవాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
8.కిరాణా దుకాణాలకి రెండు లక్షల వరకు రుణం
కిరాణా దుకాణలకు సరుకులు విక్రయించే ఫ్లిప్ కార్డ్ హోల్ సేల్ వారికోసం ‘ ఈజీ క్రెడిట్ ‘ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ మేరకు 50 వేల నుంచి రెండు లక్షల వరకు రుణాలు అందించనున్నారు.
9.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 21.194 మంది భక్తులు దర్శించుకున్నారు.
10.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 37,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.జీహెచ్ ఎంసీ పరిధిలో వాక్సినేషన్
జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా ఫస్ట్ డోస్ వాక్సిన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభం అయ్యింది.
12.మాజీ ఎమ్మెల్యే కూనంనేని నిరాహార దీక్ష
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిరసన దీక్షకు దిగారు.సింగరేణి బాధితుల కోసం ఆయన రెండు రోజులుగా నిరసన దీక్షలో నే ఉన్నారు.
13.గద్వాలలో ట్రిపుల్ ఐటీ
తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.గద్వాల లో దీనిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
14.ఉప ముఖ్యమంత్రి పై వర్ల కామెంట్స్
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పై టిడిపి నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు.ధైర్యంగా నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టలేని పిరికి ఉప ముఖ్యమంత్రి నువ్వు అంటూ విమర్శించారు.
15.హైదరాబాద్ సీపీ గా స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
16.రఘురామ పై మోపిదేవి కామెంట్స్
రఘురామ కృష్ణంరాజు తన ఉనికి కాపాడుకునేందుకు కోర్టులు, పిటిషన్ లు , మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు.
17.స్టీల్ ప్లాంట్ ఉద్యమం
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేక కమిటీ పోరాటం కొనసాగిస్తూ ఉంది.ఈ నెల 29 న మానవహారం నిర్వహించ నున్నారు.
18.శబరిమల సమాచారం
శబరిమల అయ్యప్ప దేవాలయం లో కోవిడ్ నిబంధనలు అమలు చేయవద్దని కేరళ ప్రభుత్వాన్ని కోరాలని ట్రావెన్స్ కోర్ నిర్ణయించింది.
19.బంగాళాఖాతంలో భూకంపం
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది.నెల్లూరుకు 300 కిలో మీటర్ల దూరంలో ఇది సంభవించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,350 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,380