1.రేపే ఎల్పీసెట్
ఐటిఐ చదివారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు రాసే పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య శిక్షణ కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు.
2.ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్
తెలంగాణలో ఎంసెట్ నీట్ ఐఐటీ వంటి అర్హత పరీక్షలు రాసే విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఆన్లైన్ సౌకర్యం వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
3.నీట్ రద్దు ఆలోచనే లేదు
కరుణా కారణంగా ఈ ఏడాది నీట్ పరీక్ష గాని ఇతర ప్రవేశ పరీక్షలను రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ కు తెలిపింది.
4.మంత్రి వెల్లంపల్లి కి నిరసన
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది తాళ్లాయపాలెం శివ స్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వెళ్లారు.అమరావతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ని కుదించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
5.ఏపీ కి చేరుకున్న కోవిడ్ టీకాలు
3.72 లక్షల కోవిడ్ టీకా డోసులు ఏపీకి చేరుకున్నాయి.పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవీ షీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.
6.12 సెంట్రల్ వర్సిటీలకు వీసీల నియామకం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసుత్కర్ జే రావు నియమితులయ్యారు.దీంతో పాటు దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీ లకు బీసీలను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నియమించారు.
7.కొత్త వేరియంట్ లకు బూస్టర్ డోస్ అవసరమే
కరోనా మహమ్మారి లో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి కట్టడికి పోస్టర్ డోస్ లు అవసరం పడే అవకాశం ఉందని గేమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.
8.తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోంది
తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్ టాపింగ్ పాల్పడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శలు చేశారు.
9.ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ నిర్వహించనున్నారు.ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సిఎస్ లు , ఐపీఎస్ లు పాల్గొంటున్నారు.
10.గ్రూప్ వన్ అప్పీళ్ల పై విచారణ వాయిదా
గ్రూప్ వన్ ఇంటర్వ్యూ లతో పాటు తదుపరి చర్యలు అన్నిటినీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్ లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.దీనిని ఆగస్టు 18 కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
11.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.బ్రెజిల్ తో భారత్ బయోటెక్ ఒప్పందం రద్దు
బ్రెజిల్ తో కుదుర్చుకున్న వ్యాక్సిన్ ఒప్పందాన్ని భారత్ బయోటెక్ రద్దు చేసుకుంది.
13.భారత్ రానున్న అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్ రానున్నారు.ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన భారత్ లో పర్యటిస్తారు.
14.‘ నారప్ప ‘ పై మెగాస్టార్ కామెంట్స్
వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది.తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు.నారప్ప సినిమా చూస్తున్నంతసేపు వెంకటేష్ కనపడలేదని నారప్పే కనిపించాడు అంటూ మెగాస్టార్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
15.వైఎస్ వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యం గా భావిస్తున్న వాచ్ మెన్ రంగన్న వామ్మో సిబిఐ రికార్డు చేసింది.
16.ప్రధానికి విజయసాయి రెడ్డి లేఖ
ఎంపీ రఘురామకృష్ణం రాజు కు సంబంధించిన కంపెనీలు చేసిన మోసాల పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ కి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.
17.ఈ నెల 30న ఏలూరు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక
ఈ నెల 30న ఏలూరు మేయర్ , ఇద్దరు డిప్యూటీ మేయర్ ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
18.రాష్ట్రపతి ప్రధానికి వైసీపీ ఎంపీల లేఖ
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై చర్యలు తీసుకోవాలని ఆయన అనేక ఆర్థిక మోసాలకు పాల్పడే వారని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లకు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు.
19.14 రైళ్లు రద్దు
భారీ వర్షాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి దేశంలో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటంతో 14 రైళ్లను రద్దు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,870 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,870