1.నిజామాబాద్ ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
2.తిరుపతిలో మళ్లీ భారీ వర్షం
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది.దీంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
3.వైసిపి ఎమ్మెల్యేలకు భద్రత పెంపు
ఆంధ్రప్రదశ్ శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నలుగురు శాసనసభ్యులకు భద్రతను పెంచారు.వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నానికి భద్రతను పెంచారు.
4.మోదీ అమిత్ షా ల కు జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు సీఎం జగన్ లేఖ రాశారు.భారీ వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో 1000 కోట్లు ఇవ్వాలని కోరారు.
5.గౌతం గంభీర్ కు ఉగ్రవాదుల బెదిరింపు
బిజేపి ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ కు ఐసీస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.
6.వరద పరిస్థితుల పై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు .అంశాలవారీగా నెల్లూరు, చిత్తూరు, కడప ,అనంతపురం జిల్లాల కలెక్టర్లతో చర్చించారు
7.ప్రత్యామ్నాయ పార్టీగా బిజేపి
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం పార్టీగా బీజేపీ ని ఆదరిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
8.సినిమా టికెట్ల పై మంత్రి నాని కామెంట్స్
సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని, కొందరు ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటున్నారని అందుకే ఆన్లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతిని తీసుకురాబోతున్నామని ఆయన వివరించారు.
9.రైతుల ఉసురు కేసిఆర్ కు తగులుతుంది
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు తప్పకుండా రైతుల ఉసురు తగులుతుందని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
10.సాగు చట్టాల రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడమే కాకుండా ఈరోజు జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు ఆ బిల్లుని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
11.నిండు సభలో మా తల్లిని అవమానించారు : లోకేష్
నిండు శాసనసభలో మా తల్లిని అవమానించారని, దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
12.హీరో సూర్య పై పరువు నష్టం దావా
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన జై భీమ్ అందరి ప్రశంసలు అందుకుంటోంది.తాజాగా వన్నియర్ కులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుధ అరుల్ మోలీ తమిళనాడు చిదంబరం కోర్టు లో పరువు నష్టం దావా వేశారు.
13.ఢిల్లీ లో 29 నుంచి స్కూళ్లు ప్రారంభం
నవంబర్ 29 నుంచి ఢిల్లీలోని అన్ని పాఠశాలలు ,కళాశాలలు, విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించినట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
14.జమ్మూ కాశ్మీర్ లో చిక్కుకున్న 120 మంది సిక్కోలు
శ్రీకాకుళం జిల్లాలో సింధు పుష్కరాల కు వెళ్ళిన సిక్కోలు వాసులకు చేదు అనుభవం ఎదురైంది.మైసూరు కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులను శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్ళారు .ఒక్కో జంట నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలు చేశారు.ఈ క్రమంలో 120 మంది యాత్రికులను జమ్ము కాశ్మీర్ లోని కట్రా వద్ద హోటల్ కి చేరుకోగా అక్కడ వారిని వదిలేసి ట్రావెల్ ఏజెన్సీ వద్ద వదిలేసి పరారయ్యారు.
15.తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఇచ్చే జీత బత్యాలను తీసుకోను అని ప్రకటించారు.దీనిపై ఆర్టీసీ చైర్మన్ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.
16.జగన్ ఒక వృద్దుడు .ప్రజల్లో తిరగలేడు
ఏపీ సీఎం జగన్ ఒక వృద్దుడు అని, ప్రజల్లో తిరగలేడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్ చేశారు.
17.13 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
ఇంటర్మీడియట్ మార్చి 2022 పబ్లిక్ పరీక్షలకు ఫస్టియర్ , సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయ్యి, మళ్లీ పరీక్షలకు హజరవ్వాలి అనుకునే విద్యార్థులు డిసెంబర్ 13 వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించ వచ్చు అని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు.
18.రెండు కీలక బిల్లులు ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
రెండు కీలక బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులను ఆమోదించారు.
19.వచ్చే ఏడాది వరకూ ఉచిత రేషన్
వచ్చే ఏడాది వరకు ఉచిత రేషన్ ను పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,700
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,760
.