1.31 వరకు ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఎడ్సెట్కు దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.
2.ఓటమి భయంతోనే ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ ద్వారా భారత్ లోని చాలా మంది ఫోన్లను పెగాసిస్ తమ ఆధీనంలోకి తీసుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాకింగ్ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ వద్ద నిరసన కు దిగారు.
3.మోదీ రేషన్ .మోదీ వాక్సిన్ అంటూ పోస్టర్లు
కరుణ ప్రభావం ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెల ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని బిజెపి నాయకులు చెప్పడమే కాకుండా హైదరాబాదులోని కెపిహెచ్బీ నాలుగో పేజ్ లోని రేషన్ షాప్ గోడకు ‘ మోదీ రేషన్ .మోదీ వాక్సిన్ ‘ అనే పాస్టర్ ను అంటించారు.
4.జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళన
కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా zingi సరిహద్దు నుంచి 200 మంది రైతులు బస్సులో జంతర్మంతర్ వద్దకు చేరుకుని కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
5.రైతులకు క్షమాపణ చెప్పిన కేంద్ర మంత్రి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కేంద్ర మంత్రి మీనాక్షి లేకి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.” వాళ్ళు రైతులు కాదు హులి గాన్స్ ( ఆకతాయిలు ,పోకిరీలు ) అంటూ మాట్లాడడం పై దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు కోరారు.
6.ఐదో రోజు ఈటెల రాజేంద్ర పాదయాత్ర
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఐదో రోజు ఈటెల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు.పాపక్కపల్లి మీదుగా పాదయాత్ర నిర్వహించారు.
7.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.దళిత బంధు పై అవగాహన సదస్సు
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న రైతు బంధు పథకం పై ఈనెల 26 అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
9.ఆగస్ట్ 16 నుంచి ఏపీలో బడులు
ఏపీలో ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
10.విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య విద్యుత్ పంపిణీ వ్యవస్థ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం తో పాటు, 1912 కాల్ నంబర్ అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
11.రాయలసీమ టీడీపీ నేతల భేటీ
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వివాదం పై రాయలసీమ ప్రాంత టిడిపి నేతలంతా సమావేశమయ్యారు.
12.బ్రహ్మం గారి మఠం లో పీఠాధిపతి వివాదం
బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి వివాదం చెలరేగింది.వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
13.శ్రీ వారి సేవలో సుప్రీం న్యాయమూర్తి
నేడు తిరుమల శ్రీ వారిని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ నవీన్ , ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు.
14.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పర్యవేక్షణ అధికారిని సీబీఐ మార్చివేసింది.
15.బంగళా ఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో దాని ప్రభావం తో తమిళ నాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
16.నెలకు రెండు జాబ్ మేళాలు
నెలకు రెండు జాబ్ మేళాలు నిర్వహిస్తామని, రాష్ట్రంలో ఆగస్ట్ 15 నుంచి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజి లను ప్రారంభిస్తున్నామని ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు.
17.పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి
పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
18.ఏపీ లో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1843 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.కిషన్ రెడ్డి ని కలిసిన ఉక్కు నిర్వాసితులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉక్కు నిర్వాసితులు , బాధితులు కలిసి తమ సమస్యలపైన లేఖ ఇచ్చారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,700