1.అమెజాన్ ఫ్లిప్ కార్డ్ కు నోటీసులు
నాసిరకం వస్తువుల విక్రయాలపై అమెజాన్ ఫ్లిప్ కార్డ్ తో పాటు మరికొన్ని సంస్థలకు కేంద్ర వినియోగ పరిరక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది.
2.జగన్ కు చంద్రబాబు వార్నింగ్
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కి వార్నింగ్ ఇచ్చారు.పరిపాలన చేతకాకపోతే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు.
3.కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఏపీ శాసనమండలి లో నూతనంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం.
4.వెంకట్రామిరెడ్డి పై జగ్గారెడ్డి కామెంట్స్
వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కోకాపేట, కొల్లూరు, జహీరాబాద్ భూముల పేరుమీద దండిగా దోపిడీ చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
5.బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తి
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ లో భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 22 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
6.26 వరకు తేలికపాటి వానలు
తెలంగాణలో ఆగ్నేయ దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వేస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది 26 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
7.ఏపీ తెలంగాణ కు అమిత్ షా గుడ్ న్యూస్
ఏపీ తెలంగాణలోనూ గిరిజన మ్యూజియం లు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
8.మహిళా శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో అంగన్వాడీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
9.కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదా పై బాబు ఆగ్రహం
కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు.
10.తనికెళ్ళ భరణి కి పురస్కారం
ప్రముఖ నటుడు రచయిత సాహితీవేత్త తనికెళ్ల భరణి కి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది.
11.కొండపల్లి చైర్మన్ ఎన్నిక వివాదం పై హైకోర్టు ఆగ్రహం
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయమై వివాదం తలెత్తడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ లు కోర్టుకు రావాలని ఆదేశించింది.
12.త్వరలో టూరిజం పాలసీ : కిషన్ రెడ్డి
టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ త్వరలోనే తీసుకువస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
13.ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ శాసన మండలి రద్దు ను వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.
14.చంద్రబాబుకు ముద్రగడ లేఖ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.ఆ లేఖలో ముద్రగడ ను విమర్శిస్తూ ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు.
15.23వ రోజుకు చేరిన మహా పాదయాత్ర
మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు కు వ్యతిరేకంగా అమరావతి రైతు మహా పాదయాత్ర నేటికి 45 రోజులకు చేరుకుంది .
16.విజయశాంతి కామెంట్స్
ఏపీలో వర్షాల పై నాయకురాలు విజయశాంతి కామెంట్స్ చేశారు.రాయలసీమ లో కురుస్తున్న వర్షాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అంటూ వ్యాఖ్యానించారు.
17.బురద తొలగించిన ఎమ్మెల్యే
భారీ వర్షాల తో బురదమయంగా మారిన తిరుపతి లోని రోడ్లు, ఎల్ బీ నగర్ వీధిలో బురదను తొలగించారు.
18.80 శాతం సబ్సిడీ తో రాయితీ విత్తనాలు
శాసన సభ లో వరద నష్టం పై మంత్రి కన్న బాబు ప్రకటన విడుదల చేశారు.వారికి 80 శాతం రాయితీతో విత్తనాలను సరఫరా చేస్తామని ప్రకటించారు.
19.కోలుకున్న ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హారిచందన్ కరోనా నుంచి కోలుకున్నారు.రేపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,990 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,990