1. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
ఏపీ , తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
2.త్రి కేటీఆర్ విమర్శలు
ముఖ్యమంత్రి కెసిఆర్ ను దేశద్రోహి బీజేపీ నాయకుల పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.కోవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఈ ఏడాది పాటు రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
3.రఘురామకృష్ణంరాజు కామెంట్స్
మూడు రాజధానులు బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆనందం వ్యక్తం చేశారు ఇది ప్రజా విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
4.ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి డార్విన్ గ్రూప్
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలోకి డార్విన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అడుగుపెట్టింది.
5.ఉద్యమానికి సిద్ధమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.గత కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దిగిరాక పోవడంతో ఈ నెల 26న వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
6.కేబినెట్ నిర్ణయం పై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
మూడు రాజధానులు నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్ ఉపసంహరించుకోవడం పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.బిల్లుల ఉపసంహరణకు ఇది ఇంటర్వెల్ మాత్రమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
7.కవితకు రాజ్యసభ సీటు ఖరారు
తన కుమార్తె నిజామాబాద్ దానికి సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు రాజ్యసభ సీటు కేసీఆర్ ఖరారు చేశారు.
8.రేపే హిందీ ‘ జెర్సీ ‘ ట్రైలర్
తెలుగులో హిట్ అయిన ‘ జెర్సీ ‘ సినిమాను అదే పేరుతో బాలీవుడ్లోకి రీమేక్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
9.వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు పై పార్లమెంటరీ కమిటీ భేటీ
వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు 2019 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సోమవారం భేటీ కానుంది.బిజెపి ఎంపి పిపి చౌదరి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
10.ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : అమరావతి జేఏసీ
మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయడానికి స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ నేతలు పేర్కొన్నారు.
11.తెలంగాణలో వ్యాక్సినేషన్ పై హైకోర్టులో విచారణ
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
12.ఏపీలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు
రాయలసీమ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ ఆస్తి ప్రాణ నష్టం చోటు చేసుకుంది.మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి ఐదు హెలికాప్టర్ లు చేరుకున్నాయి.
13.కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
14.కెసిఆర్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హుజురాబాద్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిన ఓటర్ల అందరికీ డబ్బులు పంపిన అధికార పార్టీ పోయిందని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
15.మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ
తెలంగాణలో సంచలనం రేపిన మరియమ్మ లాకప్ డెత్ కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
16.వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ఏపీలో భారీ వర్షాలతో అతలాకుతలమైన వరద బాధిత ప్రాంతాలను టిడిపి అధినేత చంద్రబాబు రేపు సందర్శించనున్నారు.
17.శ్రీశైలం లో పెద్ద పులి సంచారం
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్ద పులి సంచారం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
18.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్
ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ కి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో రెగ్యులర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తోంది.మొత్తం 896 పోస్టులు ఉన్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,280 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,280
.