1.వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్ఆర్ సీపీ అధినేత శరీరములను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.షర్మిల మొదటి గా ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం బొడుప్పల్ లో దీక్షకు దిగిన షర్మిలను పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
2.‘వ్యవసాయ ‘ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రెండేళ్ల వ్యవసాయ, మూడు సంవత్సరాల అగ్రీ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యింది.
3.తాత్కాలికంగా కొన్ని రైళ్లు రద్దు
కాచిగూడ – దొనకొండ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేశారు.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతుంది సోమవారం తిరుమల శ్రీవారిని 31,558 మంది భక్తులు దర్శించుకున్నారు.
5.శిఖామణి కి ‘ పరుచూరి ‘ సాహితీ పురస్కారం
అరసం నేత డాక్టర్ పరుచూరి రాజారామ్ స్మృత్యర్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్న సాహితీ పురస్కారం ను 2020-21 సంవత్సరానికి ప్రసిద్ధి సాహితీవేత్త , కవి, సంధ్యా సపాదకులు శిఖామణి ( కర్రి సంజీవరావు ) కు అందజేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ తెలిపారు.
6.లైన్ మెన్ పోస్టులు భర్తీ చేయాలి : హై కోర్టు
జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ హై కోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది.
7.టాలీవుడ్ డ్రగ్స్ కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ తారలకు సంబంధాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తప్పుదోవ పట్టించారని డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ చార్జిషీట్ లో పేర్కొంది.
8.పోలీసులపై నారా లోకేష్ కామెంట్స్
ఏపీలో జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
9.గురజాడ జయంతి వేడుకలు
మహాకవి గురజాడ అప్పారావు 159 వ జయంతి వేడుకలు విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
10. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెంచిన విద్యుత్ చార్జీలు, వ్యవసాయ సత్తాను రద్దు చేయాలంటూ విశాఖ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
11.జగన్ కు ముద్రగడ లేఖ
సినిమా టికెట్ల ను ఆన్లైన్లో విస్తరించాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం పై కాపు నేత ముద్రగడ పద్మనాభం జగన్ కు లేఖ రాశారు.
12.వాణిజ్య ఉత్సవం 2021 ప్రారంభం
వాణిజ్య ఉత్సవం 2021 ను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించారు.
13.విశాఖలో పవన్ పర్యటన
వచ్చే నెలలో విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారని, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
14.విద్యా కానుక పై సీఎం అసంతృప్తి
విద్య కనుక కిట్ లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను ఏపీ సీఎం జగన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
15.గంగవరం వాటా విక్రయంపై హై కోర్టు లో పిటిషన్
గంగవరం లో వాటా విక్రయం పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
16.రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్ లో అంతరాయం
ఏపీ లో రేషన్ సర్వర్ లో అంతరాయం ఏర్పడింది.నిన్నటి నుంచి సమస్య పరిష్కారం కాకపోవడంతో రేషన్ డీలర్లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
17.ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోడల్ బీజేపీ కాఫీ చేస్తోందని ఆ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు.రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
18.బెయిల్ పై విడుదలైన రాజ్ కుంద్రా
పోర్న్ చిత్రాల కేసులో రెండు నెలల క్రితం అరెస్ట్ అయిన వ్యాపారవేత్త , శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను మంగళవారం ఉదయం ఆర్థర్ రోడ్డు జైలు నుంచి విడుదలయ్యారు.
19.గంభీర్ కేసు విచారణ పై ఢిల్లీ హై కోర్ట్ స్టే
మాజీ క్రికెటర్ బిజెపి ఎంపీ గౌతం గంభీర్ covid19 మందులను అనధికారికంగా నిల్వ ఉంచారాన్న కేసులో ట్రయల్ కోర్టు విచారణ పై స్టే విధించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,330 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,330
.