1.ఇంటర్ పరీక్షల పై మంత్రి సబిత సమీక్ష
ఈ నెల 25 నుంచి తెలంగాణలో జరగబోయే ఇంటర్ పరీక్షల పై అన్ని శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
2.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
హైదరాబాద్ లోని గోషామహల్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
3.జేఎన్టియూ హెచ్ డి నోటిఫికేషన్
పీహెచ్ డీ ప్రవేశాలకు జేఎన్టీయూ నోటిఫికేషన్ జారీ చేసింది.
4.పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పొందాలంటే ఉద్యోగ పెన్షనర్లు నవంబర్ 31 లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి అని తెలంగాణ అకౌంటెంట్ కార్యాలయంలో ని పే అండ్ అకౌంట్ విభాగం సూచించింది.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 27,878 ముందు భక్తులు దర్శించుకున్నారు.
6.షర్మిల పాదయాత్ర
షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండవరోజు మొయినాబాద్ మండలంలో మొదలయ్యింది.
7.బీజేపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుక
వాల్మీకి జయంతి వేడుకలు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
8.విదేశీ విద్యానిధి కి దరఖాస్తులు
మహాత్మ జ్యోతిబాపూలే విదేశీ విద్య నిధి పథకం కి నవంబర్ 1 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు.
9.అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ గడువు పొడగింపు
డాక్టర్ బి ఆర అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరే గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు యునివర్సిటీ అధికారులు తెలిపారు.
10.‘ ధరణి పై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి
ధరణి పోర్టల్ పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఎన్.హెచ్.ఆర్.సీ ఆదేశించింది.
11.చంద్రబాబు దీక్షకు రైతుల మద్దతు
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం లో రైతులు నిరసనకు దిగారు.
12.పట్టాభిని విజయవాడ కు తరలించిన పోలీసులు
టిడిపి అధికార ప్రతినిధి పాట విని పోలీసులు తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు.
13.ఉత్తర ప్రదేశ్ లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొంతమంది అల్లర్లు చేపట్టారు.
14.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,454 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.విమానాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు
మన దేశ గగనం స్థలంపై విమానలు అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్ బ్రాండ్ సేవలందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ సిదమైంది.
16.విజయ్ దేవరకొండ మరో పవన్ కళ్యాణ్ : దిల్ రాజు
విజయ్ దేవరకొండ రూపంలో సినీ పరిశ్రమకు మరో యూత్ ఫుల్ హీరో దొరికాడు అని, ఆయన మరో పవన్ కళ్యాణ్ అని దిల్ రాజు అన్నారు.
17.డైరెక్టర్ శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయినట్టు సమాచారం.
18.గృహ హక్కు పథకం పై జగన్ సమీక్ష
జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ గురువారం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం పై సమీక్ష నిర్వహించారు.
19.‘ మిస్టర్ ప్రేమికుడి’గా ప్రభుదేవా
ప్రభుదేవా, ఆదాశర్మ, నిక్కీ గల్రానీ హీరో హీరోయిన్ లుగా నటించిన తమిళ చిత్రం ‘ చార్లీ చాప్లిన్ 2’ చిత్రాన్ని ‘ మిస్టర్ ప్రేమికుడు పేరుతో ఈ నెల 28 న విడుదల చేస్తున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,470 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47, 470
.