1.రైతులతో బిజెపి నేతల పాదయాత్ర
మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు కు వ్యతిరేకంగా అమరావతి రైతు మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నెల్లూరులో రైతుల పాదయాత్రలో ఏపీ బిజెపి నాయకులు పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు.
2.చిరంజీవి ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
3.నారా రోహిత్ నిరసన
చంద్రబాబు నాయుడు తల్లితండ్రులు దివంగత అమ్మణమ్మ, నారా ఖర్జూర నాయుడు సమాధుల వద్ద సినీ హీరో నారా రోహిత్ నిరసన దీక్షకు దిగారు.
4.చంద్రబాబు కు రజనీకాంత్ ఫోన్
టిడిపి అదినేత చంద్రబాబు కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశాయి.మొన్న అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీసి బాబు కి ధైర్యం చెప్పారు.
5.ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం
ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది.కొత్తగా కౌన్సిలింగ్లో పాల్గొన్న విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ నవీన్ కోరారు.
6.తెలంగాణ టిడిపి మౌన ప్రదర్శనలు
చంద్రబాబు కుటుంబం పట్ల వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రదర్శనలు దీక్షలు చేపట్టాలని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు బక్కని నర్సింహులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
7.నేడు భారత్ – న్యూజిలాండ్ చివరి మ్యాచ్
నేడు భారత్ న్యూజిలాండ్ చివరి టి 20 మ్యాచ్ జరగనుంది.కోల్ కత్తా వేదికగా రాత్రి 7 గంటలు మ్యాచ్ ప్రారంభం కానుంది.
8.నేడు ఢిల్లీకి కెసిఆర్
నేడు ఢిల్లీకి మంత్రులు ఎంపీలు అధికారులతో సీఎం కేసీఆర్ బృందం వెళ్లనుంది.ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించబోతున్నారు.
9.తిరుమల సమాచారం
వర్షాల కారణంగా ఇబ్బందులు భక్తుల దర్శనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రెండు ఘాట్ రోడ్ల ద్వారా అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.
10.ఏపీ లో భారీ వర్షాలు
ఏపీలో వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి.భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
11.అర్ధరాత్రి టిడిపి నేత అరెస్ట్
టీడీపి నేత కూన రవికుమార్ అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు .
12.టీటీడీ కి నాలుగు కోట్ల నష్టం
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా నష్టం వాటిల్లింది దాదాపు నాలుగు కోట్లకు పైగా నష్టం జరిగినట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
13.కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి : కేసీఆర్
కేంద్రం తెచ్చిన కొత్త విద్యుత్ చట్టం ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
14.నెల్లూరు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర
ఏపీ రాజధాని గా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన పాదయాత్ర నేడు నెల్లూరు జిల్లాకు చేరుకుంది.
15. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 13,099 మంది భక్తులు దర్శించుకున్నారు.
16.కుంగిన పాపాగ్ని బ్రిడ్జి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది.కడప జిల్లా కమలాపురం లో పాపాగ్ని బ్రిడ్జి శనివారం రాత్రి 9 గంటల సమయంలో కొంత మేరకు కుంగిపోయింది.
17.షర్మిల విమర్శలు
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.బయటి రాష్ట్రాల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం ఇస్తామంటూ ప్రకటించడంపై ఆమె ఎద్దేవా చేశారు.తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగులు, కరోనా మృతుల కుటుంబాలకు ఎన్ని లక్షలు ఇచ్చారు అంటూ ఆమె ప్రశ్నించారు.
18.డిసెంబర్ రెండో వారంలో సంజీవ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మలిదశ ప్రజాసంకల్పయాత్ర డిసెంబర్ రెండవ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
19.వరదలపై లోకేష్ స్పందన
ఏపీ లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,280 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,280