1.ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్ రావు
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ను ఎన్నుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య సమితి ప్రకటించింది.
2.మెగాస్టార్ కు టిఆర్ఎస్ ఎంపీ కృతజ్ఞతలు
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.దీనిపై టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.
3.భువనగిరిలో కిషన్ రెడ్డి యాత్ర
యాదాద్రి భువనగిరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది.
4.కొండపల్లి లో పెద్దపులి కలకలం
తెలంగాణలోని కొమరం భీం జిల్లా పెంచికల్ పేట మండలం కొండపల్లి లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 18,462 మంది భక్తులు దర్శించుకున్నారు.
6.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 359 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.
7.వివేకా హత్య కేసు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 76 వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది.
8.ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
9.వివేక మాజీ డ్రైవర్ ను విచారించిన సిబిఐ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు.కడప కేంద్ర కార్యాలయంలో అతిథిగృహంలో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ని విచారించారు.
10.కాబూల్ నుంచి 85 మంది భారతీయుల తరలింపు
కాబూల్ నుంచి భారత వాయుసేన సి – 130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది.
11.శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్ లక్ష్మి
తిరుమల శ్రీవారిని హీరో మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్న నేడు దర్శించుకున్నారు.
12.150 మంది భారతీయుల కిడ్నాప్
కాబూల్ విమానాశ్రయంలో విమానం కోసం ఎదురుచూస్తున్న 150 మందికి పైగా భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
13.ఉగాదికి విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్
వచ్చే ఏడాది ఈ ఉగాదికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
14.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 34,457 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.రమ్య కుటుంబానికి ఇంటి పట్టా
గుంటూరు లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను అందజేసింది.
16.ఆఫ్ఘన్ నుంచి ఇండియా కి చేరుకున్న తెలుగు జవాన్
ఆఫ్ఘనిస్తాన్ నుంచి కమాండో హజీవలీ గురువారం ఢిల్లీకి చేరారు.ఈ విషయాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం లో ఉన్న ఆయన బంధువులు తెలియజేశారు.
17.ఏపీలో కరోనా
ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1435 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.భారత్ లో మరో టీకా
భారత్ లో మరో కోవిడ్ టీకా వినియోగానికి ఆమోద ముద్ర పడింది.జైడస్ క్యాడీల సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ జైకొవ్ – డి ‘ వీనియోగానికి ఆమోద ముద్ర లభించింది.
19.ఆత్రేయపురం పూతరేకుకు తపాలాశాఖ గుర్తుంపు
తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం పూతరేకుల పై భారత తపాల శాఖ పోస్టల్ కవర్ రూపొందించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,210 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,210