1.రేవంత్ పై కెటిఆర్ పరువు నష్టం దావా
తనకు సంబంధం లేని విషయాలు ఉద్దేశపూర్వకంగా తన పేరును వాడుతున్నారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.
2.గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు
ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకం లో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.
3.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 30,811 మంది భక్తులు దర్శించుకున్నారు.
4.నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పెరగడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
5.ఆర్టీసీ కార్మికుల సమస్యల పై నేడు విచారణ
టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆ సంస్థ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది.
6.అందరికీ శ్రీవారి సర్వదర్శనం
ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే రోజుకు 2000 సర్వ దర్శనం టిక్కెట్లు ఇస్తున్న టిటిడి, అన్ని ప్రాంతాల వారిని సర్వదర్శనానికి అనుమతించేందుకు వీలుగా టోకెన్ల సంఖ్య ఎనిమిది వేలకు పెంచింది.
7.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 173 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
8.రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఇవ్వడం లేదు ? ఐపీఎస్ అధికారి కమిటీ ఏమైంది అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
9.టీటీడీ పాలకమండలి నియామకంపై హైకోర్టులో పిల్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం పై హైకోర్టులో పిల్ దాఖలైంది.
10.మత్స్యకారుల ధర్నా
మత్స్యకారుల జీవన పరిస్థితులను దెబ్బతీసే జీవో నెంబర్ 217 వెంటనే రద్దు చేయాలని కృష్ణాజిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
11.ఏపీ సచివాలయం కి టాలీవుడ్ ప్రముఖులు
తెలుగు goo3 చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు, సోమవారం ఉదయం ఏపీ సచివాలయం కి చేరుకున్నారు ఆన్ లైన్ టికెటింగ్ తమ ప్రభుత్వానికి స్పష్టం చేయబోతున్నారు.
12.మందకృష్ణ మాదిగను పరామర్శించనున్న బాబు
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ను టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు పరామర్శించనున్నారు.
13.ఆన్లైన్ టికెట్ విధానం పై మంత్రి పేర్ని నాని సమీక్ష
ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేరు సమీక్ష నిర్వహించనున్నారు.
14.పంజాబ్ సీఎం గా చరణ్ జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ కొత్త ప్రభుత్వం ఈరోజు కొలువు తీరింది కొత్త ముఖ్యమంత్రిగా దళిత సుక్కు నాయకుడు చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 30,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.నా కానుకల ఈ వేలం లో పాల్గొనండి : ప్రధాని
గత కొంతకాలంగా తనకు వచ్చిన కానుకలు మంటలను ఈ వేలం వేస్తున్నారు అందులో పాల్గొని కొనుగోలు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
17. కోవాగ్జింపై అక్టోబర్ 6న డబ్ల్యూహెచ్ఓ భేటీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) కరోనా వ్యాక్సిన్ పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (సేజ్ ) అక్టోబర్ 6 సమావేశం కానుంది.
18.సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై కేంద్రం సైలెన్స్
వివిధ హైకోర్టులో 68 మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం మౌనంగా ఉండడం పై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
19.రేప్ తెలంగాణలో భారీ వర్షాలు
మంగళవారం తెలంగాణలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,130 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,130