1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.సాగు చట్టాల రద్దు పై కంగనారనౌత్ స్పందన
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు పై సినీ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటని, అవమానకరమని ఆమె పేర్కొన్నారు.
3.శబరిమల యాత్ర నిలిపివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంబా నది పొంగి పొర్లుతోంది ఈ నేపథ్యంలో శబరిమల యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.
4.ఏపీలో భారీ వర్షాలు 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు
ఏపీ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి పద్దెనిమిది వందల ఆర్టీసీ సర్వీసులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
5.చంద్రబాబు కన్నీళ్ళ పై నందమూరి చైతన్య స్పందన
నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు పై నందమూరి చైతన్యకృష్ణ స్పందించారు రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతారా .మీకు సిగ్గు, లజ్జా ఉందా గొంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
6.బాలయ్య వార్నింగ్
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ ఆస్సాసినేషన్ మంచిది కాదని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.గొడ్ల చావిట్లో ఉన్నామా అసెంబ్లీ లో ఉన్నామా అంటూ వ్యాఖ్యానించారు.
7.కెసిఆర్ కీలక భేటీ
తెలంగాణ లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు.
8.వ్యవసాయ చట్టాల రద్దు పై వైసిపి స్పందన
నూతన సాగు వ్యవసాయ చట్టాలు రోడ్డుపై వైసిపి స్పందించింది.రైతుల విజయానికి మద్దతుగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని నిర్ణయించింది.
9.చంద్రబాబు కు మద్దతుగా హెడ్కానిస్టేబుల్ రాజీనామా
చంద్రబాబు కుటుంబం పై వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శలను చేయడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ కృష్ణ రాజీనామా చేశారు దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
10.జగన్ ను కలిసిన త్రిదండి చిన్న జీయర్ స్వామి
ఏపీ సీఎం జగన్ ను ఆయన నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.
11.జగన్ ఏరియల్ సర్వే
ఏపీలో నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం సదరు జిల్లా లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
12.నేడు కొత్త మద్యం దుకాణాలకు లాటరీ
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఈరోజు లాటరీ నిర్వహించనున్నారు.
13.ప్రధాని మోదీకి ఎంపీ వరుణ్ గాంధీ లేఖ
పంటలపై కనీస మద్దతు ధర కు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు.
14.రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరసనలు
టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరుస్తూ వైసిపి నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా నేడు టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
15.చంద్రబాబుపై వల్లభనేని వంశీ కామెంట్స్
మాధవ రెడ్డి పేరు ఎత్తగానే ప్రబల పెడుతున్నావ్ చంద్రబాబు అంటూ గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబుపై విమర్శలు చేశారు.మరి నీ పుత్ర రత్నం పప్పు నాయుడు మమ్మల్నందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నీ పెద్దరికం ఏమైంది ? నీ ఇంగిత జ్ఞానం ఏమైంది అంటూ వంశీ విమర్శించారు.
16.21న తుంగభద్ర అంత్య పుష్కరాలు
తుంగభద్ర అంత్య పుష్కరాలు ఈ నెల 21న నిర్వహించనున్నారు.
17.రాజస్థాన్ లో ముగ్గురు మంత్రుల రాజీనామా
రాజస్థాన్ లో ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు ఆ లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు.రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి, వైద్యశాఖ మంత్రి రఘు శర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొస్తారాలు రాజీనామా లేఖలు పంపిన వారిలో ఉన్నారు.
18.మహిళా ఫారెస్ట్ అధికారిపై పులి దాడి .మృతి
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తాడోబో టైగర్ రిజర్వ్ కోలారో అటవీ ప్రాంతంలో పులుల గణన కోసం వెళ్ళిన మహిళా ఫారెస్ట్ రేంజర్ స్వాతి దుమ్నే ( 43) శనివారం ఉదయం విధుల్లో ఉండగా పులి దాడి చేసింది.ఈ ఘటనలో ఆమె మృతి చెందారు.
19.నారా రోహిత్ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై సినీ నటుడు నారా రోహిత్ స్పందించారు.పశువుల కంటే హీనంగా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారంటూ ఆయన విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,270 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,270
.