1.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
నేడు సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
2.వందశాతం ఫ్రస్ట్ డోస్ వాక్సినేషన్ పూర్తి
జిహెచ్ఎంసి పరిధిలో 100% ఫస్ట్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది.
3.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 20,701 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
4.‘మను ‘ ప్రవేశ పరీక్ష
గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) ఈ నెల 23 24 25 న పలు రెగ్యులర్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
5.సెప్టెంబర్ మొదటి వారంలో కోర్టు ప్రారంభం
నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ఉమ్మడి జిల్లా జడ్జి ఎంవీ రమేష్ తెలిపారు.
6.అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్ష తేదీల్లో మార్పులు
ఈ నెల 20న నిర్వహించాల్సిన డిగ్రీ 6 సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబరు 1కి వాయిదా వేశామని బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
7.ఎడ్ సెట్ కు 42,399 దరఖాస్తులు
ఈ నెల 24 25 తేదీ ల్లో నిర్వహించబోయే తెలంగాణ ఎడ్ సెట్ కు 42,399 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.
8.ఈ సెట్ లో 95 శాతం పైనే ఉత్తీర్ణత
తెలంగాణ ఈ సెట్ ప్రవేశ పరీక్షల్లో 95.16 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
9.బిజీ షెడ్యూల్ లో మాణిక్యం ఠాగూర్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఈ రోజు హైదరాబాద్ లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడపనున్నారు.
10.పాస్టర్ హనీ జాన్సన్ అరెస్ట్
హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా విమర్శలు చేస్తున్న పాస్టర్ హనీ జాన్సన్ ను పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు.
11.నేడు టీ పిసిసి కార్యవర్గ సమావేశం
టిపిసిసి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది.
12.ఆధార్ లేకున్నా వాక్సిన్
గుర్తింపు కార్డులు లేని వలస కూలీలు, పేదలు, వికలాంగులు, వృద్ధులకు కొవిడ్ వాక్సిన్ ఉచితంగా అందించనున్నట్టు పెప్సికో ఫౌండేషన్ తెలిపింది.
13 ‘ దిశా ‘ నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది.
14.మావోయిస్టు పార్టీపై నిషేధం పొడగింపు
సిపిఐ మావోయిస్టు తో పాటు దానికి అనుబంధంగా పని చేసే సంఘాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడగించాయి.
15.వివేకా హత్య కేసు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన 74 వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది.విచారణకు కీలక అనుమానితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి మరోసారి హాజరయ్యారు.
16. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు టీకా కేసులు
గన్నవరం ఎయిర్ పోర్ట్ కి కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి.ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2,88,00 టీకా డోసులు చేరుకున్నాయి.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్త గా 18,73,757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.స్పుత్నిక్ లైట్ టీకా పై క్లినికల్ పరీక్షలు
రష్యాకు చెందిన ఒకే డోసు కొవిడ్ -19 టీకా ‘ స్పుత్నిక్ లైట్ ‘ ను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ లెబరేటరీస్ సిద్ధం అవుతోంది.ఈ మేరకు క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.
19.32 కే లీటర్ పెట్రోల్
కేంద్ర ప్రభుత్వం సెక్స్ న్యూ తగ్గిస్తే పెట్రోల్ రేట్లు భారీగా తగ్గుతాయని, 32 కే లీటర్ పెట్రోల్ వస్తుందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు.
20.ఈరోజు బంగారం ధర లు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,510 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,510
.