1.వైఎస్సార్ జిల్లాలో వరదలు ఉధృతం 15 మంది గల్లంతు
వైయస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది చేయ్యేరు నదిలో 15 మంది గల్లంతు.అయ్యారు.
2.సినీ దర్శకుడు మనిశేఖరన్ కన్నుమూత
ప్రముఖ రచయిత సినీ దర్శకుడు మనిశేఖరన్ గురువారం వృద్ధాప్యం కారణంగా చెన్నైలో మృతి చెందారు.
3.వ్యవసాయ చట్టాల పై రేవంత్ కామెంట్స్
మూడు వ్యవసాయ చట్టాల పై నిర్ణయం మొదటిరోజు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలిన అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
4.కన్నబాబు వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంత్రి కన్నబాబు హెరిటేజ్ సంస్థను ప్రస్తావనకు తీసుకురాగా , దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
5.నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం
శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం నవంబర్ 19 న దర్శనం ఇవ్వబోతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది.
6.మోదీ ప్రకటనను స్వాగతిస్తున్నాం : బాబు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
7.గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మధుసూధనాచారి కెసిఆర్ ఫైనల్ చేశారు.
8.జాతినుద్దేశించి ప్రధాని సందేశం
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
9.మరో మూడు రోజులు భారీ వర్షాలు
మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవ పోతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.టీటీడీ కీలక నిర్ణయం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళ్ నాడు ఏపీ ప్రభావం చూపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.భారీ వర్షాల కారణంగా తిరుమలకు రాలేకపోయినా భక్తులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
11.రాజధాని రైతుల పాదయాత్రకు బ్రేక్
ఏపీలో మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు కు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన మహాపాదయాత్ర ను వర్షం కారణంగా వాయిదా వేశారు.
12.స్మార్ట్ పోలీసింగ్ లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందుతున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది.ఇండియన్ పోలీస్ పౌండేషన్ స్మార్ట్ పోలీసింగ్ సర్వే 2021 విడుదల చేసింది దీంట్లో ఏపీకి మొదటి స్థానం లభించింది.
13.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.సెల్ టవర్ రైతుల నిరసన
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో కొంతమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
15.విదేశీ విద్యా పథకం అమలు చేయాలి
విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు దివ్యాంగ విద్యార్థులకు విదేశీ విద్యా పథకం అమలు చేయాలని మహిళా శిశు , దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ దివ్యాంగుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
16.ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంచాలి
ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు గడువు కు మరో 15 రోజుల సమయం పెంచాలని కోరుతూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ చెరుకుల రాజేందర్ వినతిపత్రం ఇచ్చారు.
17.యాదాద్రిలో భక్తుల రద్దీ
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
18.ఏపీ గవర్నర్ ఆరోగ్యపరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు.
19.నేడు చెన్నై వద్ద తీరం దాటనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం ఉదయం చెన్నై సమీపంలో తీరం దాటిన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,100