1.ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు.
2.ఆంధ్ర బీహార్ సిఎస్ లకు సుప్రీం కోర్టు సమన్లు
ఆంధ్ర బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది.కోవిడ్ మృతుల కుటుంబాలకు అందించాల్సిన నష్టపరిహారం పై ప్రశ్నించింది.
3.అంతర్జాతీయ విమానాలు రద్దు
కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ను నిషేధించారు ఫిబ్రవరి 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
4.చింతామణి నాటక నిషేధం పై కళాకారుల నిరసన
ఒక సామాజిక వర్గం వారిని కించపరిచే విధంగా ఉన్నాయనే కారణంతో ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించింది.దీనిని విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.
5.షర్మిల కామెంట్స్
టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల విమర్శలు చేశారు.ఓ వైపు రైతులు మరణాలు సంభవిస్తున్నా కేసీఆర్ కు సోయి లేదు అంటూ కామెంట్ చేశారు.
6.మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గా శ్రీకాకుళం మహిళ
మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గా శ్రీకాకుళం జిల్లా వాసి పైడి రజనీ రికార్డ్ సాధించారు.
7.తెలంగాణ ఎన్నికల అధికారి బదిలీ
తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు.
8.జై గుడివాడ అంటూ వర్మ కామెంట్స్
వైసీపీ మంత్రి కొడాలి నాని కేసినో క్లబ్ నిర్వహించారని టిడిపి నేతలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు.దీనిపై వ్యంగ్యంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు.జై గుడివాడ అంటూ క్యాప్షన్ తో కామెంట్స్ చేశారు.
9.హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జ్ .రేపే ప్రారంభం
హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వెళ్లే రోడ్డులో నిర్మించారు.దీనిని రేపు ప్రారంభించనున్నారు.
10.ఐ ఎన్ ఎస్ రణవీర్ లో పేలుడు
భారత నౌకాదళం కు చెందిన ఐ ఎన్ ఎస్ రణవీర్ లో అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ముగ్గురు నేవీ అధికారులు మృతి చెందారు.
11.శ్రీకాకుళం జిల్లా లో కాల్పుల కలకలం
శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
12.ఏపీలో కారుణ్య నియామకాలకు అనుమతి
ఏపీలో కారుణ్య నియామకాలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
13.ఏపీలో కరోనా టెస్ట్ కిట్ ధరల తగ్గింపు
ఏపీలో కరోనా టెస్ట్ కిట్ ధరల ను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
14.రాయలసీమలో సోము వీర్రాజు పర్యటన
రాయలసీమ లో ఏపీ బీజేపీ అధ్యక్ష సోమవారం నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.
15.బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం
నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం ఎంపీ గరికపాటి మోహన్ రావు అధ్యక్షతన జరగనుంది.
16.భారత్ లో బ్లాక్ ఫంగస్
భారత్ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి.తాజాగా ఉత్తర ప్రదేశ్ లో కొత్త కేసు నమోదు అయ్యింది.
17.నాగార్జున కామెంట్స్
సినీ పరిశ్రమ కు ఇకపై మంచి రోజులు రాబోతున్నాయని సినీ హీరో నాగార్జున వ్యాఖ్యానించారు.
18.పొట్లూరి వరప్రసాద్ పై డికే అరుణ కుమార్తె ఫిర్యాదు
తనను వేధిస్తున్నాడు అంటూ ప్రముఖ కాళేశ్వరానికి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
19.గోవా సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ గోవా సీఎం అభ్యర్ధిగా అమిత్ పాలేకర్ పేరుని కేజ్రివాల్ ప్రకటించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,160
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49, 160
.