1.ప్రారంభమైన కెసిఆర్ మహాధర్నా
దాన్యం కొనుగోలు కేంద్రం వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ మహా ధర్నా చేపట్టారు.
2.చంద్రబాబును చూడాలని ఉంది : జగన్
అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గురువారం ఉదయం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.ఈ సందర్భంగా అసెంబ్లీ కి చంద్రబాబు తీసుకురండి కుప్పం ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనను చూడాలని ఉంది అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో జగన్ వ్యాఖ్యానించారు.
2.క్రిప్టో కరెన్సీపై ప్రధాని వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా చెలామణీ అవుతూ యువతను ఆకర్షిస్తున్న క్రిప్టో కరెన్సీ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు .చెడ్డ వారి చేతుల్లోకి క్రిప్టోకరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్ధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
3.ఏపీ కాపు సీఎం కావాలి : మాజీ ఎంపీ
ఏపీలో కాపుల జనాభా కోట్ల మంది ఉన్నారని ఏపీకి ముఖ్యమంత్రిగా కాపులను నిర్మించాయి తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ వ్యాఖ్యానించారు.
3.భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
4.ఇద్దరు మహిళా మావోయిస్టు లొంగుబాటు
విశాఖలో ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు.
5.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 25 లక్షల విరాళం
మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి 25 లక్షలు విరాళంను యోదా లైఫ్ డయాగ్నస్టిక్స్ ని చిరంజీవి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యోధా లైఫ్ డయాగ్నోస్టిక్స్ అధినేత సుధాకర్ 25 లక్షల విరాళం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి అందించారు.
6.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్చ జరుగుతోంది.హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పేరు ప్రస్తావనకు రాగా , తాజాగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాశారు సంబంధం లేదని పేర్కొన్నారు.
5.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాలన సంస్కారం లేదని, అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ధర్నాలు చేస్తున్నారు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
6.కడియం శ్రీహరి కామెంట్
రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టిఆర్ఎస్ నేత శ్రీహరి అన్నారు
7 బీజేవైఎం ధర్నా
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి అభ్గార కార్యాలయం వద్ద బీజేవైఎం చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
8.కెసిఆర్ దొంగ దీక్ష చేస్తున్నారు : సీతక్క
ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
9.మాజీ మావోయిస్టుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టు ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
10.ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.ఈమేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
11.శాసనమండలి నుంచి టిడిపి వాకౌట్
ఏపీ శాసన మండలి నుంచి టిడిపి వాకౌట్ చేసింది
12.పొక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
లైంగిక వేధింపుల కేసుల్లో స్కిన్ స్కిన్ కాంటాక్ట్ అవసరం అవసరమని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
13.గవర్నర్కు జగన్ పరామర్శ
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ఫోన్ లో పరామర్శించారు.
14.గజియాబాద్ లో చిరుత కలకలం
ఢిల్లీ యూపీ సరిహద్దుల్లో ఉన్న గజియాబాద్ లో భారీ జన సందోహం ఉన్న ప్రాంతాల్లో చిరుత పులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది
15.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
అమరావతిలో రాజధాని నిర్మించేది బీజేపీనే అంటూ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
16.‘ పుష్ప ‘ శాటిలైట్ రైట్స్
అల్లు అర్జున్ , రష్మిక జంటగా నటించిన ‘ పుష్ప ‘ శాటిలైట్ రైట్స్ 6.5 కోట్లకు అమ్ముడయ్యాయి.తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది.
17.టి సి ఎస్ గుడ్ న్యూస్
గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ శుభవార్త చెప్పింది.కెరీర్కి అవసరమయ్యే ఒక ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది.
18.రేవంత్ రెడ్డి కామెంట్స్
వరి పండించే రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అన్నారు.
19.కెసిఆర్ ను ఎవరూ ఆపలేరు
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం సీఎం కేసీఆర్ కి ముఖ్యమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,100