1.టిఆర్ఎస్ బిజెపి నేతల బాహాబాహీ
మల్కాజిగిరిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు రసాభాసగా మారింది.టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య వివాదం చెలరేగింది .మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ మధ్య వివాదం చెలరేగింది.
2.తపాల శాఖలో క్రీడాకారుల కోట ఉద్యోగాలు
తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలో క్రీడాకారుల కోటా కింద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సెప్టెంబర్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు.
3.సిపిఎస్ ‘ రద్దు ‘ పై సీఎస్ సమీక్ష
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన పెండింగ్ సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సి సి ఎస్ రద్దు వ్యవహారం పైన చర్చ జరిగింది.
4.క్రీడా ప్రతిభా పురస్కారాలు
ఏపీలో తొలిసారిగా పాఠశాల స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పాఠశాలలకు ‘ క్రీడా ప్రతిభ అవార్డు‘ లను అందజేయనున్నట్లు ఏపీ వ్యాయామ విద్య తనిఖీ అధికారి, ఏ పీ ఎస్ జి ఎఫ్ కార్యదర్శి భాను మూర్తి రాజు తెలిపారు.
5.యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
6.ఆన్లైన్ చిత్రకళ పోటీలు
అంతరించిపోతున్న చిత్రకళను తిరిగి పునర్ వైభవం తెచ్చేందుకు అక్షర వాగ్దేవి అంతర్జాతీయ పాఠశాల, పల్లవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘ ఆవిర్భావ్ ‘ పేరిట అంతర్జిల్లా చిత్రకళ పోటీలను ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించారు.
7.కొమ్రక్క యూట్యూబ్ పై ఛానెల్ పై పోలీసులకు ఫిర్యాదు
సంచార జాతులను కించపరిచే విధంగా ప్రచారం చేసిన కొమురక్క యూట్యూబ్ ఛానల్ తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోగర్తి శంకర్, అధికార ప్రతినిధి e ప్రగతి భవన్ రావు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
8.ఎంసెట్ కీ విడుదల
ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణలో జరిగిన ఎంసెట్ కీ ని కన్వీనర్ విడుదల చేశారు.
9.ఆర్జీ యూకేటికీ 20 వేల దరఖాస్తులు
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం లో 2021 22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం 2,0178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
10.పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
పాలమూరు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో 35 రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వి సి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ విడుదల చేశారు.
11.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 23,899 మంది భక్తులు దర్శించుకున్నారు.
12.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.రేపు బెంగళూరుకు ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం బెంగళూరుకి వెళ్లనున్నారు.జిక్కురు లోని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నత వైజ్ఞానిక పరిశోధన కేంద్రాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు.
14.53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు ప్రజలకు వేసిన కోవిడ్ వాక్సినేషన్ సంఖ్య 53 కోట్లు దాటింది.
15.31లోగా వృద్ధాప్య పెన్షన్ లకు దరఖాస్తు చేసుకోవాలి
వృద్ధాప్య పెన్షన్ కు అర్హత ఉన్న వారు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
16.ఎస్సీ ఎస్టీలకు ఎలక్ట్రిక్ వాహనాలు
షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన యువతను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ టి ఫ్రైడ్ ‘ పథకం కింద ఎలక్ట్రిక్ కార్లను సబ్సిడీ ధరలపై ఇవ్వాలని నిర్ణయించింది.
17.రేపటి నుంచి స్కూళ్లు
రేపటి నుంచి ఏపీలో స్కూళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.కరోనా కు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.విద్యార్థులు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడంతో పాటు సెక్షన్ కు కేవలం 20 మంది ఉండేలా చర్యలు చేపట్టారు.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 36,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.హైతీ లో భూకంపం
కరేబియన్ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ బయో లాజికల్ సర్వే చెప్పింది.ఈ ఘటనలో ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,160 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,160
.