1.నేడు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని భేటీ
స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా ఈ భేటీ జరగనుంది.
2.శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మళ్లీ భూమి కంపించింది.
3.భారత్ లో ఒమిక్రాన్
ఒమిక్రాన్ వైరస్ ప్రభావం భారత్ లో రోజు రోజుకి పెరుగుతోంది.ఇప్పటికి 6041 ఒమి క్రాన్ కేసులు నమోదయ్యాయి.
4.భారత్ లో కరోనా
గడచిన24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.317 జీవో ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేపట్టాయి.
6.ప్రజలకు సీఎం, గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
7.ఫామ్ హౌస్ లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
8.కేటీఆర్ పై షర్మిల కామెంట్స్
మంత్రి కేటీఆర్ పై షర్మిల కామెంట్స్ చేశారు.తెలంగాణలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై షర్మిల కామెంట్స్ చేశారు.
9.నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు
నేడు తెలంగాణ లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
11.తెలంగాణ లో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.పొలిటికల్ ఎంట్రీ పై చిరు కామెంట్స్
తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేదని మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు.
13.తిరుపతి ఎయిర్ పోర్ట్ కు నీటి సరఫరా బంద్ పై కేంద్రం సీరియస్
తిరుపతి ఎయిర్ పోర్ట్ కు మున్సిపాలిటీ నీటి సరఫరా బంద్ చేయడం పై కేంద్రం సీరియస్ అయ్యింది.దీనిపై కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా విచారణకు ఆదేశించారు.
14.శ్రీశైలం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
15.వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం
చిత్తూరులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం అయింది.కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ద్వంసానికి పాల్పడ్డారు.
16.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.నిన్న శ్రీవారిని 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు.
17.చిత్తూరు జిల్లాలో జల్లికట్టు
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం గోకులపురం అనుపల్లే గ్రామాల్లో జల్లికట్టు జరిగింది.
18.ఏపీలో పెరిగిన అటవీ విస్తీర్ణం
2019 తో పోల్చితే అటవీ విస్తీర్ణం 647 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
19.నిధుల పేరుతో తిరుపతి ఎంపీ కి టోకరా
నిధులు వచ్ఛాయంటూ సీఎంవో పేరుతో తిరుపతి ఎంపీ కి టోకరా వేయబోయాడు ఓ అగంతకుడు.దీనిని గుర్తించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,080
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,080
.