1.కేటిఆర్ ను కలిసిన డీఎంకే ఎంపీలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ తో డీఎంకే ఎంపీ లు బుధవారం భేటీ అయ్యారు.
2.హుజూరాబాద్ లో నామినేషన్ ల తంతు
హుజురాబాద్ లో నామినేషన్ ఉపసంహరణకు నేడు చివరి రోజు.హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 42 మంది అభ్యర్థులు ఉన్నారు.
3.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 27,176 మంది భక్తులు దర్శించుకున్నారు.
4.టి ఎస్ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఈ నెల 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
5.పాలిటెక్నిక్ తరగతులు
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ 21 కు మొదటి ఫేస్ కౌన్సిలింగ్ పూర్తయిందని, ఈ నెల18 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు కన్వీనర్ పోలా భాస్కర్ తెలిపారు.
6.నవంబర్ 29 నుంచి సైనిక నియామక ర్యాలీ
సికింద్రాబాద్ ఏవో సి సెంటర్ లో నవంబర్ 29 నుంచి సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపింది.
7.70 శాతం సిలబస్ తోనే ఫస్ట్ ఇయర్ ప్రశ్న పత్రాలు
ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలను 70 శాతం సిలబస్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
8.ఆన్లైన్ అడ్మిషన్ లపై ఏపీ హైకోర్టు స్టే
ఆన్లైన్ ద్వారా డిగ్రీ కాలేజీలలో సీట్ల భర్తీ పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
9.అంధ ఉద్యోగుల ధ్రువపత్రాలు సమర్పణకు ఐదేళ్ల గడువు పెంపు
పదోన్నతులు పొందిన అంధ ఉద్యోగులు శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత ధ్రువ పత్రాలు సమర్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది.
10.పోడు భూములపై త్వరలో సమావేశం
తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారానికి అటవీశాఖ అధికారులు, కలెక్టర్లతో ఓ సమావేశాన్ని నిర్వహిస్తాము అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు.
11.ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు
ఏపీ ఉద్యోగ సంఘాలతో బుధవారం ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది.
12.ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి.98.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
13.అంతర్జాతీయ సైన్స్ సదస్సు
ఈ నెల 29 30 సైజులు సైన్స్ పరిశోధనకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సు ను నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు.
14.ఫామ్ హౌజ్ లోనే కేసీఆర్ బతుకమ్మ , దసరా వేడుకలు
బతుకమ్మ దసరా వేడుకలను సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ జరుపుకోనున్నారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.ప్రధాని సలహాదారుగా అమిత్ ఖరే
ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు.
17.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.ఒకే రోజు 17 మంది జడ్జీల నియామకం
దేశంలో రికార్డు స్థాయిలో మంగళవారం 3 హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు.
19.‘ మా ‘ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన విష్ణు
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,030 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,030