1.తెలుగు అకాడమీ కేసు
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో తొమ్మిది మందిని కస్టడీలోకి తీసుకుని సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు .తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
2.దిశ కేసులో హైపవర్ కమిషన్ ముందుకు సజ్జనార్
దిశ కేసులో మాజీ సీపీ సజ్జనార్ వరుసగా రెండో రోజు హైపవర్ కమిషన్ ముందు హాజరయ్యారు.
3.17న అలయ్ బలయ్
దసరాను పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ ( దసరా సమ్మేళనం ) ఈనెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో నిర్వహిస్తున్నట్లు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయ లక్ష్మి తెలిపారు.
4.కాళోజీ వర్సిటీకి హైకోర్టు నోటీసులు
ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్ష పేటర్న్ పై వివరణ ఇవ్వాలని కాళోజి హెల్త్ యూనివర్సిటీ కి జాతీయ మెడికల్ కమిషన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
5.తెలుగు వర్సిటీ దరఖాస్తులకు గడువు పెంపు
తెలుగు యూనివర్సిటీ 2021- 22 రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 21 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
6.శబరిమల స్లాట్ బుకింగ్
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ ప్రభుత్వం స్లాట్ లను విడుదల చేసింది.
7.తీన్మార్ మల్లన్న పై మరో కేసు
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
8.జలసౌధ లో కె ఆర్ ఎంబి సమావేశం
జలసౌధ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అయింది.
9.విజయవాడ ఎంపీ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
విజయవాడ అ టీడీపీ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు కొండ పైకి కేశినేని నాని ఆయన వాహనంలో వెళ్తుండగా, ఘాట్ రోడ్డు వద్ద పోలీసులు నిలిపివేశారు.దీంతో కాలినడకనే వెళ్లి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
10.మున్సిపల్ టీచర్ల బదిలీలకు అనుమతి
ఏపీ లోని మున్సిపల్ టీచర్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
11.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.బాలయ్య టాక్ షో లో మెగాస్టార్
‘ అన్ స్టాపబుల్ ‘ వర్కింగ్ పేరుతో బాలకృష్ణ ఓ టాక్ షోలో చేయబోతున్నారు ఈ టాక్ షోలో మెగా స్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారు.
13.బొగ్గు కొరత పై ప్రధాని సమీక్ష
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
14.సమంత స్టైలిస్ట్ కు బెదిరింపులు
సమంత నాగచైతన్య విడాకులకు కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ అంటూ ఆయనకు సోషల్ మీడియా లో అపరిచితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15.తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేదు
తెలంగాణలో విద్యుత్ సంక్షోభంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
16.భారత్ లో మరో ప్రైవేట్ ఎయిర్లైన్స్ కు అనుమతి
ఆకాశ ఎయిర్ అనే ఎయిర్లైన్స్ సంస్థ భారత్ లో విమానాలు నడిపేందుకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
17.హైకోర్టులో ఏపీ ప్రభుత్వం రిట్
పేదల ఇళ్ల పథకం పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
18.జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ మృతి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పి ఆర్ ఓ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు.
19.పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకున్న అమితాబ్
పాన్ మసాలా బ్రాండ్ కు అంబాసిడర్ గా తప్పుకుంటున్నట్లు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,030 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,030
.