1.సీఎం సహాయ నిధికి ఐదు కోట్లు
కర్ణాటక సీఎం సహాయ నిధికి ఆ రాష్ట్ర ఖనిజ కార్పొరేషన్ ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చింది.
2.శ్రీ శైలం లో అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శ్రీ శైలం లో మల్లన్న ను దర్శించున్నారు.హైదరాబాద్ నుంచి హెలోకాఫ్టర్ ద్వారా ఆయన ఇక్కడికి చేరుకున్నారు.
3.జగన్ ఆస్తుల్లో షర్మిలకూ వాటా ఇవ్వాలి
ఏపీ సీఎం జగన్ ఆస్తుల్లో షర్మిలకు సగం వాటా ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.
4.ఎమ్మెల్యే గా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా నోముల భగత్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.
5.లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మేయర్
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.హనుమకొండ చౌరస్తాలోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్ళారు.హాస్పిటల్స్ ప్రారంభం చేసిన తర్వాత బయటకు వెళ్తుండగా లిఫ్టు లో ఇరుక్కుపోయారు.ఆ తరువాత అతి కష్టం మీద బయట పడ్డారు.
6.హరీష్ పై ఈటెల కామెంట్స్
ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గం లో అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు.
7.త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.
8.గురుకుల కాలేజీల్లో నేరుగా సీట్లు కేటాయింపు
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్ డిగ్రీ కాలేజీల ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేసింది.విద్యార్థులు కోరుకున్న చోటే నేరుగా సీట్లు పొందే సౌకర్యం కల్పించింది.
7.గురుకుల హల్ టికెట్ డౌన్ లోడ్ లో ఇబ్బందులు ఉంటే
గురుకుల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష జరగనుంది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది.ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే 8008904486 నంబర్ కు ఫోన్ చేయాలని రమణ కుమార్ కోరారు.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 21,156 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
9.వారంలో రెండు సార్లు సచివాలయాల తనిఖీ
బ్రహ్మ సచివాలయం తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ లను చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
10.బహుమతిగా భారత్ ఇచ్చిన హెలికాప్టర్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
ఆహ్వానిస్తూ నాన్ బహుమతి గా ఇచ్చిన యుద్ద హేలికాఫ్టర్ లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
11.పూల నుంచి అగర బత్తిల తయారీ
పొలం నుంచి అగరవత్తులు తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది.తిరుమల శ్రీవారికి అభిషేకించిన పుష్పాల తో అగరబత్తీలు తయారీకి శ్రీకారం చుట్టింది.
12.క్రయోజెనిక్ ఇంజిన్ లోపం వల్లే రాకెట్ ప్రయోగం వైఫల్యం
గురువారం ఉదయం ప్రయోగించిన జిఎస్ఎల్వీ- ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం మూడో దశ లో విఫలం అయ్యింది.దీనిపై ఇస్రో మాజీ సైంటిస్ట్ సాంబశివరావు స్పందించారు. క్రయోజెనిక్ ఇంజిన్ లోపం వల్లే రాకెట్ ప్రయోగం వైఫల్యం చెందింది అన్నారు.
13.ఓబిసి స్కాలర్షిప్ లకు
ఓబిసి స్కాలర్షిప్ లకు 3,459 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుఫ్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు.
14.నేటి హైదరాబాద్ లో బుక్ ఫెయిర్
స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గచ్చిబౌలి లోని పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఎక్స్ ఫొ గల్లేరియా లో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు.12 నుంచి 15 వరకు స్టేషన్ లోని లెవల్ 1 లో బుక్ ఫెయిర్ నిర్వహణకు ఏర్పాటు చేశారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 41,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.నటి మీరా మిథున్ కు సమన్లు
దళితుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్ గురువారం తమ ముందు హాజరు కావాలి చెన్నై సెంట్రల్ క్రైమ్ విభాగ పోలీసులు సమన్లు జారీ చేశారు.
17.మంత్రులు ఎమ్మెల్యేలకు కరోనా పరీక్ష
తమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ ఈనెల 13 న ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు, పోలీసులు , పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
18.సెప్టెంబర్ 30 వరకు ఐటిఆర్ గడువు పొడగింపు
గత ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీ జులై 31 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడగించారు.
19.మావోయిస్టు కీలక నేతలు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు లో కీలకంగా పనిచేసిన కలిమెల దళ సభ్యులను పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేసినట్టు సమాచారం.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,540 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,540
.