1.ఆర్ఆర్ఆర్ వాయిదా
రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది.థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో కొత్త రిలీజ్ డేట్ ను ఇప్పట్లో ప్రకటించలేమని చిత్ర యూనిట్ ప్రకటించింది.
2.’ గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ వాయిదా
సందీప్కిషన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న గల్లీ రౌడీ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది.
3.ఈటెల ఒక శని : కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ ఒక శని అని టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు.
4.డ్రోన్ల సహాయంతో ఔషధాల పంపిణీ
డ్రోన్ల సహాయంతో ఔషధాల పంపిణీ మొదలైంది అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సహాయంతో మందుల సరఫరా కోసం మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
5.ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వరద నీరు
దేశ రాజధాని ఢిల్లీ లో కుండపోత వర్షాల కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా వరద నీరు నిలిచిపోయింది.
6.ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపు తో ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా భద్రత సిబ్బందిని మోహరించారు.
7.జగన్ కు అనిత లేఖ
ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల పై గత కొంత కాలంగా టీడీపి ఆందోళనలు నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపి మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనిత జగన్ కు లేఖ రాశారు.
8.నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం
సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ప్రకటించింది.
9.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేటికి 14 రోజుకి చేరుకుంది.ఆందోల్ మండలం సంగు పేట నుంచి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
10.ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గట్లు ఎత్తివేత
మంచిర్యాల జిల్లా లో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 25 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినప్పుడు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
11.బిగ్ బాస్ షో పై నారాయణ ఆగ్రహం
బిగ్ బాస్ షో 5 సెవెన్ ప్రారంభమైన నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే షో ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
12.ఆటో డ్రైవర్ పై ఎలుగుబంటి దాడి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఆటోడ్రైవర్ నాగేంద్ర పై ఎలుగుబంటి దాడి చేసింది.
13.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 20,505 మంది భక్తులు దర్శించుకున్నారు.
14.నేడు సీమ టిడిపి నేతల సదస్సు
కృష్ణా జలాల హక్కుల పై టిడిపి నేతలు ఈరోజు అనంతపురం జిల్లాలో సదస్సు నిర్వహించనున్నారు.
15.బంగాళాఖాతంలో అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని విపత్తుల శాఖ ఏపీ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
16.వరద ముంపు లో ఏజెన్సీ గ్రామాలు
గోదావరి ప్రవాహం ఉద్యమంగా ఉండడంతో దేవీపట్నం మండలం లోని 30 ఏజెన్సీ గ్రామాలు వరద ముంపు లో ఉన్నాయి.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 33,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.ఉత్తరాఖండ్ లో భూకంపం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 నమోదైంది.
19.సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన తలసాని
రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. 20.ఈరోజు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,080 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,080
.