1.రేవంత్ రెడ్డి మౌనదీక్ష
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇందిరాపార్క్ వద్ద మౌనదీక్ష ఈరోజు చేపట్టారు.ఉత్తర ప్రదేశ్ లోని లఖిమ్ పూర్ లో దీక్ష చేస్తున్న రైతులు పైనుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కారు తొక్కించే హత్య చేసిన సంఘటన కు నిరసనగా ఏఐసిసి పిలుపుమేరకు ఈ దీక్ష చేపట్టారు.
2.హుజురాబాద్ లో నామినేషన్ల పరిశీలన
హుజురాబాద్ ఉప ఎన్నిక పోటీ కోసం దాఖలైన అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.
3.‘ మా ‘ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు.
4.రేపు నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష
వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు నల్గొండ జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు.
5.అంగన్వాడీ దరఖాస్తులకు రేపటితో గడువు పూర్తి
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ విభాగం చేపట్టిన అంగన్వాడీ పోస్టుల భర్తీకి తెలంగాణలోని జనగాం జిల్లాలో మంగళవారం తో దరఖాస్తు గడువు ముగుస్తుంది.
6.నేడు అల్పపీడనం
కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది.
7.బాధ్యతలు స్వీకరించిన గీతారెడ్డి
టీ పిసిసి కార్య నిర్వాహక అధ్యక్షురాలిగా గాంధీ భవన్ లోని తన కార్యాలయంలో గీతా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
8.కుప్పం లో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.
9.మాజీమంత్రి గుడివాడ జయంతి వేడుకలు
విశాఖలో దివంగత నేత , మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు జయంతి వేడుకలు నిర్వహించారు.
10.కాపు రిజర్వేషన్ల కోసం పోస్టుకార్డు ఉద్యమం
కాపు రిజర్వేషన్ సాధన కోసం పోస్ట్ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య తెలిపారు.
11.తిరుమలలో జగన్ పర్యటన
ఈరోజు రేపు తిరుమల లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.
12.ఇంద్రకీలాద్రి సమాచారం
విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు రెండు అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఉదయం అన్నపూర్ణాదేవిగా, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మి దేవి గా దుర్గమ్మ దర్శనం లభించనుంది.
13.ఏపీలో నేడు వ్యవసాయ ఉద్యోగుల నిరసన
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తీరును నిరసిస్తూ ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం ప్రత్యక్ష ఆందోళనకు దిగింది.
14.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18, 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.హై కోర్టు సీజే సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారం చేశారు.
16.నేడు గోదావరి నది యాజమాన్య బోర్డ్ సమావేశం
గోదావరి నది యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.జి ఆర్ ఎం బి సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.
17.సుప్రీం కోర్టు కి దసరా సెలవులు
సుప్రీంకోర్టు ఈరోజు నుంచి 19 వ తేదీ వరకు దసరా సెలవులు వచ్చాయి.
18.విష్ణు కు చిరంజీవి శుభాకాంక్షలు
మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
19. తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 33,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,940 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,940
.