1.హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల ప్రమాణ స్వీకారం
హుజురాబాద్ లో ఎమ్మెల్యే గా గెలిచిన ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.
2.తమిళనాడులో భారీ వర్షాలు : ఈ రోజు రేపు సెలవు
తమిళనాడు ను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు సెలవు దినాలు గా ప్రభుత్వం ప్రకటించింది.
3.కలెక్టర్ భార్యకు హరీష్ రావు ప్రశంసలు
ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రి లో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిసెట్టి అనుదీప్ సతీమణి మాధవి మగబిడ్డ కు జన్మనివ్వడం తో మంత్రి హరీష్ రావు ప్రశంసించారు.
4.ఏపీ హై కోర్టు లో ఉద్యోగాలు
ఏపీలో హై కోర్ట్ లో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.మొత్తం 20 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
5.అనంత విద్యార్థులతో లోకేష్ ముఖా ముఖి
అనంతపురం జిల్లా లో పోలీసుల దాడుల్లో గాయపడిన విధ్యారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు.
6.అమరవీరులకు ఈటెల రాజేందర్ నివాళులు
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గన్ పార్క్ లో అమరవీరుల కు నివాళులు అర్పించారు.
7.నిరుద్యోగుల మార్చ్ పై సమీక్ష
ఈ నెల 16 న నిర్వహించ బోతున్న నిరుద్యోగ మార్చ్ పై బీజేపీ ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు.
8.ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగానికి చెందిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీసు విభాగం లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల పోస్టులకు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
9.రైతులకు మద్దతుగా ఎల్లుండి నిరసన : మంత్రి గంగుల
రైతులకు మద్దతు ధర చేపడుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
10.ఉదయం 4 నుంచి సిటీ బస్సులు
ఉదయం నాలుగు గంటల నుంచి సిటీ బస్సులను నడుపుతున్నట్లు హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
11.శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలు
శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
12.కాపు ఉద్యమం నుంచి పూర్తిగా తప్పుకున్నా : ముద్రగడ
కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.
13.కాంగ్రెస్ రెండోరోజు శిక్షణ తరగతులు
కాంగ్రెస్ శిక్షణా తరగతులు రెండోరోజు ప్రారంభమయ్యాయి.ఈరోజు అనేక అంశాలపై నేతలకు అవగాహన కల్పిస్తున్నారు.
14.మంత్రి అవంతి నివాసం సమీపం లో జనసేన నిరసనలు
మంత్రి అవంత్రి శ్రీనివాస్ నివాసంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
15.పదో రోజు మహా పాదయాత్ర
రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు , మహిళలు చేపట్టిన పాదయాత్ర నేటికి పదో రోజు కి చేరుకుంది.
16.రేపు శ్రీ వారి ఆలయంలో పుష్ప శ్రీ యాగం
రేపు తిరుమల శ్రీ వారి ఆలయంలో పుష్ప శ్రీ యాగం ను నిర్వహించనున్నారు.
17.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.తిరుమల శ్రీ వారిని 32,816 మంది దర్శించుకున్నారు.
18.మహా పాదయాత్ర పై పోలీసుల ఆంక్షలు కొనసాగింపు
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
19.అమ్మ ఒడి కి హాజరు నిబంధన
ఇక పై అమ్మ ఒడి పథకం వర్తించాలి అంటే తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాల్సిందే అనే నిబంధనను ఏపీ ప్రభుత్వం విధించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,250 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,250
.