1.కాంగ్రెస్ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభం
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం సోమవారం ప్రారంభం అయ్యింది.
2.సమాచార అధికారులకు సీఎస్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
సమాచార అధికారులకు సీఎస్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది.
సమాచారం ఇచ్చే ముందు శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది.
3.బిజెపి ఆఫీస్ బేరర్స్ సమావేశం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి ఆఫీస్ బేరర్స్ ముఖ్యనేతల సమావేశం ఈరోజు ప్రారంభమైంది.
4.షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 13వ రోజుకు చేరుకుంది.
5.నిరుద్యోగ మిలియన్ మార్చ్ కు బిజెపి సిద్ధం
నిరుద్యోగులకు మద్దతుగా మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు బిజెపి సిద్ధమవుతోంది.
6.కోటి ఉద్యోగాల పై జగ్గారెడ్డి ప్రశ్న
రాష్ట్ర విభజన జరిగినా వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కెసిఆర్ సభలో టి ఎస్ పి ఎస్ సి మాజీ సభ్యుడు సిహెచ్ విఠల్ హామీ ఇచ్చారని , కోటి ఉద్యోగాలు ఇచ్చారా లేదా దీనిపై సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 28,311 మంది భక్తులు దర్శించుకున్నారు.
8.పులి చర్మం పట్టివేత
కొమరం భీం జిల్లా లోని కాగజ్ నగర్ లో పెద్ద పులి చర్మం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
9.మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వారోత్సవాలు
భారతదేశ మొట్టమొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కన్వీనర్ డాక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
10.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 3837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.భాగ్య లక్ష్మి ఆలయంలో దీపావళి ఉత్సవాలు
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం లో దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 2 నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్టీ శశికళ తెలిపారు.
12.ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో మిగిలిన కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
13.జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్ లు ధర్నా చేపట్టారు.
14.కాంగ్రెస్ సభ్యత్వం తో రెండు లక్షల ఇన్సూరెన్స్
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రెండు లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
15.యూపీ సీఎం వార్నింగ్
ఆఫ్ఘన్ దేశాన్ని వర్షం చేసుకున్న తాలిబాన్ లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు.భారత్ పైపుగా ఆ మూకలు వస్తే వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు.
16.శ్రీ శైలం లో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం
శ్రీ శైలం లో నవంబర్ 5 నుంచి కార్తీకమాసం ఈ నెల 5 నుంచి ప్రారంభం అవుతుంది అని ఈవో లవన్న తెలిపారు.
17.వానాకాలం పంట ప్రభుత్వం కొంటుంది : హరీష్
వానాకాలం పంట మొత్తాన్ని ప్రభుత్వం కొంటుంది అని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు రైతులకు హామీ ఇచ్చారు.
18.రైతుల మహా పాదయాత్రకు బాబు సంఘీభావం
రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు టీడీపి అధినేత చంద్రబాబు సంఘీ భావం తెలిపారు.
19.వ్యాయామం చేసిన ఉప రాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ రోజు కృష్ణ జిల్లా లో పర్యటిస్తున్నారు.ఆ జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,700
.