1.పసుపు రైతుల పై ఎమ్మెల్యే ఆగ్రహం
ప్రజలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసుపు సమస్యలపై ధర్నా చేసే హక్కు రైతులకు లేదని చెప్పారు.బాండ్ పేపర్ రాయించుకుని మరి బీజేపీ ఎంపీ అరవింద్ కు ఓట్లు వేయించారు సంజయ్ మండిపడ్డారు.
2.ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకా
ఏపీలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ రెండో విడత లో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.రేపటి నుంచి వారికి వాక్సిన్ వేయనున్నారు.
3.పీఆర్సీ పై మరిన్ని సంఘాలతో భేటీ
తెలంగాణలో పిఆర్సి పై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ మరికొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది.
4.ఏపీ ఎం ఈ ఆర్సీ బోర్డు ఏర్పాటు
ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ బోర్డు ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
5.ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు
ఏకగ్రీవాలు కు తాను వ్యతిరేకం కాదని పారదర్శకంగా ఎన్నికలు జరగాలని ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
6.413 వ రోజుకు రాజధాని నిరసనలు
అమరావతి రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 413 రోజుకు చేరుకున్నాయి.
7.పరకాల ఎమ్మెల్యే పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది.
8.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు.శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లన్నీ నిర్బంధించి మంగళవారం రైతు సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
10.నేపాల్ లో భూకంపం
నేపాల్ దేశంలోని లోభ్యూజ్యా ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై 5.2 నమోదైంది.
11.లోకల్ రైళ్లు ప్రారంభం
కరోనా కారణంగా గత కొంతకాలంగా ముంబై లోకల్ ట్రైన్ లు బంద్ అయ్యాయి.తిరిగి వీటిని పున ప్రారంభించారు.
12.యాష్కీ కి టిపిసిసి చీఫ్ ఇవ్వాలి
ఓబీసీ వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలి అని, తెలంగాణ టి.పిసిసి, ఓబీసీ సెల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
13.మత్స్యకార సంఘాలకు సంచార వాహనాలు
మత్స్యకార సంఘాలకు సంచార వాహనాలను కామారెడ్డి జిల్లా పాలనాధికారి శరత్ సోమవారం పంపిణీ చేశారు.
14.పార్టీ జెండా ఉపయోగిస్తే కేసు
అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళ అన్నా డీఎంకే పార్టీ చిహ్నాన్ని ఉపయోగిస్తే, కేసు వేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి షణ్ముగం హెచ్చరించారు.
15.క్యాన్సర్ తో ప్రముఖ నటుడు మృతి
సేవ్డ్ బై ది బెల్ ‘ సీరియల్ తో బాల నటుడిగా గుర్తింపు పొందిన హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్ డైమండ్ (44) మృతి చెందారు .
16.కుక్కల పరుగుపందెం
మహబూబ్ నగర్ జిల్లాలోని పెంచికలపాడు గ్రామంలో కుక్కల పరుగు పందాలు పోటీలు జరిగాయి.చౌడేశ్వరి జాతర సంబరం సందర్భంగా నిర్వహించిన పోటీలకు కర్నూలు, కర్ణాటకలోని రాయచూరు జిల్లాల నుంచి కుక్కలను పోటీకి తీసుకొచ్చారు.
17.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.టీడీపీ నేత పట్టాభి పై దాడి
తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పట్టాభి పై విజయవాడ లో దాడి జరిగింది.ఈ ఘటనలో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు.పట్టాభికి ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి.
19.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,590
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,590
.